Begin typing your search above and press return to search.

తిరుమల డిక్లరేషన్ వివాదం పై వైవీ సుబ్బారెడ్డి స్పందన

By:  Tupaki Desk   |   19 Sep 2020 5:30 PM GMT
తిరుమల డిక్లరేషన్ వివాదం పై వైవీ సుబ్బారెడ్డి స్పందన
X
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే ఏ మతానికి చెందిన వారైనా దేవుడికి నమ్మకంతో వస్తే చాలని.. ఏ మతస్థులైనా స్వామిని దర్శించుకోవచ్చని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ప్రకటనపై పలు హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు, బీజేపీ నేతలు తప్పుపట్టారు. వేరే మతస్థులను డిక్లరేషన్ లేకుండా ఎలా రానిస్తారని వివాదం చెలరేగింది.

దీంతో తాజాగా ఈ వివాదం పై మరోసారి వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈరోజు విలేకరులతో మాట్లాడారు. హిందూయేతరులు ఎవరైనా డిక్లరేషన్ పై సంతకం చేసి దర్శనం చేసుకోవాలని చట్టంలో ఉంది. సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులు ఎవరూ సంతకం చేయడం లేదు. గుర్తించిన భక్తులు మాత్రమే డిక్లరేషన్ తీసుకుంటున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

సీఎం జగన్ గతంలో పలుమార్లు శ్రీవారిని దర్శించుకున్న సమయంలో ఎప్పుడూ డిక్లరేషన్ సమర్పించలేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.. అలాగే సోనియాగాంధీ, వైఎస్ఆర్ కూడా డిక్లరేషన్ పై సంతకం చేయలేదు. దయచేసి నా మాటలను వక్రీకరించకండి అని వైవీ సుబ్బారెడ్డి ఈ డిక్లరేషన్ వివాదంపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. డిక్లరేషన్ అంశానికి కట్టుబి ఉన్నామని.. శ్రీవారిని దర్శించుకునే హిందూయేతరులు డిక్లరేషన్ ఇవ్వాలని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. దీంతో ఈ వివాదానికి ముగింపు పలికారు.