Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : సీఎం‌ జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా !

By:  Tupaki Desk   |   2 Jun 2020 8:10 AM GMT
బ్రేకింగ్ : సీఎం‌ జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా !
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఢిల్లీ కి బయల్దేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఉన్నట్టుండి ఈ పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా సమావేశాలతో బిజీగా ఉండటంతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. త్వరలోనే మళ్లీ అపాయింట్‌మెంట్ ఖరారు కాగానే ఢిల్లీకి వెళతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

లాక్‌ డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో - పోలవరం నిధుల గురించి కేంద్ర జల్‌ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌ తో చర్చించాలని సీఎం వైఎస్‌ జగన్‌ భావించారు. షెడ్యుల్‌ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు సీఎం బయలుదేరి వెళ్లాల్సి ఉండగా - అయితే , చివరి నిముషంలో ఈ పర్యటన వాయిదా పడింది.జగన్‌ టూర్‌ రద్దు కావటంతో అమిత్‌ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ లు రద్దయ్యాయి..