Begin typing your search above and press return to search.

విషాదం: కరోనా వైరస్ తో వైసీపీ నేత మృతి

By:  Tupaki Desk   |   13 Aug 2020 3:46 PM GMT
విషాదం: కరోనా వైరస్ తో వైసీపీ నేత మృతి
X
ఏపీలో కరోనా కల్లోలంగా మారింది. రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే రెండున్న లక్షలు దాటేశాయి. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, సెలెబ్రెటీలు కూడా కరోనా బారిన పడుతూనే ఉన్నారు.

ఏపీలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యులతోపాటు వీరికి కూడా కరోనా సోకడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే రోజురోజుకి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

నిన్న టీడీపీ నేత ఒకరు కరోనాతో మరణించగా.. ఈరోజు వైసీపీ నేత ఒకరు కరోనా సోకి మరణించారు.

పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులోని కుమారదేవం గ్రామానికి చెందిన వైసీపీ పార్టీకి చెందిన ఏఎంసీ చైర్మన్ యాండపల్లి రమేశ్ మరణించారు.

రమేశ్ సహాయం కోరి వచ్చిన ప్రతీ ఒక్కరికి అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రజానాయకుడని గ్రామస్థులు మన్ననలు పొందిన ఆయన మరణించడంతో పార్టీ కార్యకర్తలు షాక్ కు గురయ్యారు.