Begin typing your search above and press return to search.

పాడుబుద్ధి: మేనల్లుడితో వెళ్లిపోయిన ఆరుగురు పిల్లల అత్త

By:  Tupaki Desk   |   22 March 2023 7:00 PM GMT
పాడుబుద్ధి: మేనల్లుడితో వెళ్లిపోయిన ఆరుగురు పిల్లల అత్త
X
రోజులు మారాయి. పరిస్థితులు మారిపోతున్నాయి. బంధాలు.. అనుబంధాల మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలు కొన్ని షాకింగ్ గా మారుతున్నాయి. అలాంటి ఉదంతమే ఒకటి తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. .ఈ ఉదంతం గురించి తెలిసిన వారంతా నోటి వెంట మాట రాకుండా విస్మయానికి గురి చేసే పరిస్థితి.

యాభై ఏళ్ల వయసులో భర్తను.. ఆరుగురు పిల్లల్ని వదిలేసి.. మేనల్లుడితో జంప్ అయిన అత్త ఉదంతం షాకింగ్ గా మారింది. వివాహేతర సంబంధం వేళ.. చోటు చేసుకున్న ఈ ఉదంతం షాకిచ్చేలా మారింది.

మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలోని డియోరిపోలీస్ స్టేషన్ పరిధిలో యాబై ఏళ్ల మహిళ హెలెన్చాయ్ నివాసం ఉంటున్నారు. ఆమెకు భర్త.. ఆరుగురు పిల్లలు ఉన్నారు. ఆమెకు మేనల్లుడు సతీశ్.

ఆమె కంటే దాదాపు 20 ఏళ్లు చిన్నోడు. ఏం జరిగిందో కానీ.. మేనత్త.. మేనల్లుడి మధ్య వివాహేతర సంబంధం చోటు చేసుకుంది. కొంతకాలంగా ఈ వ్యవహారం సాగుతోంది. అయితే.. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రాత్రి వేళ నుంచి ఆమెకనిపించకుండా పోయింది.అర్థరాత్రి వేళ.. భర్తకు మెలుకువ వచ్చి చూస్తే.. ఆమె కనిపించలేదు.

దీంతో ఆమె కోసం వెతికారు. పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు. సరిగ్గా అదే రోజున మేనల్లుడు సతీశ్ కూడా కనిపించకుండా పోయాడు. దాదాపు నెల దాటేసి.. మరో వారం జరిగినా ఇప్పటివరకు వీరిద్దరి ఆచూకీ మాత్రం లభించలేదు.

దీంతో.. వీరి కోసం పోలీసులు వెతుకుతున్నారు. కానీ.. ఎలాంటి సమాచారం అందని పరిస్థితి. భార్య ఇంట్లో నుంచి వెళ్లిన వేళలో.. ఇంట్లో ఉండాల్సిన రూ.60వేలు కూడా కనిపించకుండా పోయినట్లుగా ఇంటి యజమాని వాపోతున్నాడు. ఆరుగురు పిల్లల్ని వదిలేసి వెళ్లిపోయిన ఈ మహిళ ఉదంతం షాకింగ్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.