Begin typing your search above and press return to search.
తెలుగు, కన్నడ లిపి ఒకేలా ఎందుకు ఉంటాయి? వాటి చరిత్ర ఏంటి?
By: Tupaki Desk | 14 May 2023 8:00 PMదక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషలు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం. ఈ భాషలన్నీ కూడా భారత ప్రధానమైన భాషా కుటుంబాల్లో ఒకటైన ద్రావిడ కుటుంబానికి చెందినవి. అందుకే వీటిని ద్రావిడ భాషలు అని అంటారు. తెలుగు, కన్నడ భాష రాయడం దాదాపు ఒకేలా ఉంటుంది. అందుకే ఇటు తెలుగువాళ్లు, అటు కన్నడవాళ్లలో చాలా మంది ఈ రెండు భాషలను చదవగలరు. మరి ఈ రెండు భాషలు ఒకేలా ఎందుకు ఉంటాయో.. వీటి మూలాలు ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం.
భారతదేశంలోని భాషలను ప్రధాన 5 కుటుంబాలుగా చెబుతున్నారు చారిత్రక పరిశోధకులు. అందులో ఇండో-యూరోపియన్, ద్రవిడీయన్, ఆస్ట్రో ఏసియాటిక్, టిబెటో బర్మీస్, సెమిటో హామిటిక్ కుటుంబాలున్నాయి. ఇందులో మన కుటుంబానికి చెందినది ద్రవిడియన్. ఈ కుటుంబంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గోండి, కోయ భాషలుంటాయి.
ఈ ద్రవిడ కుటుంబం మరో నాలుగు వర్గాలుగా విభజించారు. అందులో దక్షిణ ద్రవిడ భాష, దక్షిణ-మధ్య ద్రవిడ, మధ్య ద్రవిడ, ఉత్తర ద్రవిడ భాషలుంటాయి. మూల దక్షిణ ద్రావిడ భాషల సమూహం నుంచే దక్షిణ మధ్య ద్రావిడ భాషలు వచ్చాయని 'ది ద్రవిడియన్ లాంగ్వేజెస్'అనే పుస్తకంలో భద్రిరాజు కృష్ణమూర్తి రాశారు.
అంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే మూలం నుంచి వచ్చాయని తెలుస్తోంది. అందువల్ల ఈ రెండు బాషల మధ్య లిపి నిర్మాణం దగ్గరదగ్గరగా ఉంటుంది. 6వ శతాబ్దంలో తెలుగు, కన్నడ భాషలో వేసిన శాసనాలు కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అదేవిధంగా క్రీ.శ.624 నుండి 1189 మధ్య ప్రాంతాలను పాలించిన వేంగి చాళుక్యుల కాలంలో శాసనాలు కూడా తెలుగు-కన్నడ లిపిలో ఉంటేవి. 15వ శతాబ్దం వరకు తెలుగు-కన్నడ ఒక్కటిగా ఉండి ఆ తరువాత విడివిడిగా ప్రయాణించాయి.
కన్నడ భాషకు దగ్గరగా ఒకప్పుడు తెలుగులో ఉండే చిన్న అడ్డగీతలు ఇప్పుడు తలకట్టుగా మారాయి. వంకరగా ఉండే అక్షరాలు గుడ్రంగా మారాయి. నిజానికి ప్రిటింగ్ యత్రాలు వచ్చాక తెలుగు అక్షరాలను అలా మలిచినట్లు తెలుస్తోంది. పాతకాలం నాటి గ్రంథాలు పరిశీలిస్తే అందులో తలకట్టు ఉండదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనం కామా(,), ఫుల్స్టాప్(.) వాడుతున్నాం. కానీ పూర్వం తెలుగులో కామా బదులు ఒక నిలువు గీత, ఫుల్ స్టాప్ బదులు రెండు నిలువుగీతలు వాడేవారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే ఇంట్లో పుట్టి విడిపోయిన అన్నదమ్ములని చెప్పొచ్చు.
భారతదేశంలోని భాషలను ప్రధాన 5 కుటుంబాలుగా చెబుతున్నారు చారిత్రక పరిశోధకులు. అందులో ఇండో-యూరోపియన్, ద్రవిడీయన్, ఆస్ట్రో ఏసియాటిక్, టిబెటో బర్మీస్, సెమిటో హామిటిక్ కుటుంబాలున్నాయి. ఇందులో మన కుటుంబానికి చెందినది ద్రవిడియన్. ఈ కుటుంబంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, గోండి, కోయ భాషలుంటాయి.
ఈ ద్రవిడ కుటుంబం మరో నాలుగు వర్గాలుగా విభజించారు. అందులో దక్షిణ ద్రవిడ భాష, దక్షిణ-మధ్య ద్రవిడ, మధ్య ద్రవిడ, ఉత్తర ద్రవిడ భాషలుంటాయి. మూల దక్షిణ ద్రావిడ భాషల సమూహం నుంచే దక్షిణ మధ్య ద్రావిడ భాషలు వచ్చాయని 'ది ద్రవిడియన్ లాంగ్వేజెస్'అనే పుస్తకంలో భద్రిరాజు కృష్ణమూర్తి రాశారు.
అంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే మూలం నుంచి వచ్చాయని తెలుస్తోంది. అందువల్ల ఈ రెండు బాషల మధ్య లిపి నిర్మాణం దగ్గరదగ్గరగా ఉంటుంది. 6వ శతాబ్దంలో తెలుగు, కన్నడ భాషలో వేసిన శాసనాలు కూడా ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. అదేవిధంగా క్రీ.శ.624 నుండి 1189 మధ్య ప్రాంతాలను పాలించిన వేంగి చాళుక్యుల కాలంలో శాసనాలు కూడా తెలుగు-కన్నడ లిపిలో ఉంటేవి. 15వ శతాబ్దం వరకు తెలుగు-కన్నడ ఒక్కటిగా ఉండి ఆ తరువాత విడివిడిగా ప్రయాణించాయి.
కన్నడ భాషకు దగ్గరగా ఒకప్పుడు తెలుగులో ఉండే చిన్న అడ్డగీతలు ఇప్పుడు తలకట్టుగా మారాయి. వంకరగా ఉండే అక్షరాలు గుడ్రంగా మారాయి. నిజానికి ప్రిటింగ్ యత్రాలు వచ్చాక తెలుగు అక్షరాలను అలా మలిచినట్లు తెలుస్తోంది. పాతకాలం నాటి గ్రంథాలు పరిశీలిస్తే అందులో తలకట్టు ఉండదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మనం కామా(,), ఫుల్స్టాప్(.) వాడుతున్నాం. కానీ పూర్వం తెలుగులో కామా బదులు ఒక నిలువు గీత, ఫుల్ స్టాప్ బదులు రెండు నిలువుగీతలు వాడేవారు. ఒకవిధంగా చెప్పాలంటే తెలుగు, కన్నడ భాషలు ఒకే ఇంట్లో పుట్టి విడిపోయిన అన్నదమ్ములని చెప్పొచ్చు.