Begin typing your search above and press return to search.

భారత్ టూర్ లో ట్రంప్ ల్యాండ్ అయ్యేది ఎక్కడ?

By:  Tupaki Desk   |   19 Feb 2020 12:30 PM GMT
భారత్ టూర్ లో ట్రంప్ ల్యాండ్ అయ్యేది ఎక్కడ?
X
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి భారత్ కు వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. మరో నాలుగు రోజుల్లో రానున్న ఆయన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ట్రంప్ ప్రయాణించే మార్గంలో ప్రత్యేక ఏర్పాట్లను చేస్తున్న విషయం తెలిసిందే. పేదలు నివాసం ఉండే ప్రాంతాలు కనిపించకుండా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. ట్రంప్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ బయటకు రాలేదు. కాకుంటే ఆయన ఆహ్మాదాబాద్ లో కొత్తగా నిర్మించిన స్టేడియం లో మాత్రం సభను నిర్వహిస్తున్న విషయంపై తెలిసిందే.

తాజాగా ట్రంప్ ఎక్కడ ల్యాండ్ అవుతారన్న దానిపై కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటివరకూ దేశ రాజధాని ఢిల్లీలో ఆయన ల్యాండ్ అవుతారన్నప్రచారం సాగింది. అందుకు భిన్నంగా ఇప్పుడు జైపూర్ లో ల్యాండ్ కావటానికి వీలుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎందుకిలా? అంటే.. వాతావరణం సరిగా లేకుంటే ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు ప్రారంభించారు. తాజాగా జైపూర్ విమానాశ్రయాన్ని అమెరికన్ అధికారులు సందర్శించారు. నలుగురితో కూడిన భద్రతా అధికారుల బృందం ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదే అంశాన్ని జైపూర్ విమానాశ్రయాధికారి జైదీప్ సింగ్ మాట్లాడుతూ.. వీవీఐపీలు దిగటానికి వీవీఐపీ విమానాల్ని హ్యాండి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నెల 24.. 25 తేదీల్లో జైపూర్ విమానాశ్రయ ప్రాంతాల్లో హైఅలెర్ట్ ను ప్రకటించారు.