Begin typing your search above and press return to search.

ఐసీయూలో టీనేజ్ గర్ల్ పై గ్యాంగ్ రేప్ ..అసలు ఏమైందంటే !

By:  Tupaki Desk   |   26 May 2020 12:30 PM GMT
ఐసీయూలో టీనేజ్ గర్ల్ పై గ్యాంగ్ రేప్ ..అసలు ఏమైందంటే !
X
ఈ మధ్య కాలంలో సమాజంలో మానవమృగాలు ఎక్కువైపోతున్నారు. జాలితో చూసేవారికంటే కోరికతో చూసేవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా చత్తీస్ ఘడ్ రాష్ట్రం బిలాస్ పూర్ జిల్లాలోని జరిగిన ఓ ఘటన ఇప్పుడు అందరిని షాక్ కి గురిచేస్తుంది. స్థానిక ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లోని ఐసీయూలో చికిత్స పొందుతున్న ఓ యువతి చేసిన ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఐసీయూలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని యువతి సంచలన ఆరోపణలు చేస్తుంది. వార్డు బాయ్స్ తనను గ్యాంగ్ రేప్ చేశారని యువతి చెబుతోంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. గ్రాడ్యుయేషన్ ఫస్టియర్ చదువుతున్న టీనేజ్ అమ్మాయి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాట్లాడలేని స్థితిలో ఉన్న యువతి చేతిరాతితో పోలీసులకు కంప్లయింట్ చేసింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ..బిలాస్ పూర్ జిల్లా కేంద్రానికి చెందిన యువతి ఇటీవల అనారోగ్యానికి గురైంది. మే 18న బిలాస్ పూర్ లోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లో చేరింది. ఆ వెంటనే ఐసీయూకి తరలించి చికిత్స అందించారు. దీనితో లోపలి ఎవరిని రానివ్వలేదు. దీనితో తల్లిదండ్రులు బయటే ఉన్నారు. అయితే, ఆ తరవాత ఆరోగ్యం కుదుటపడటంతో మే 19న డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న కారణంగా యువతి మాట్లాడలేకపోయింది. దీనితో ఇంటికి రాగానే పెన్ను, పేపర్ ఇవ్వాలని తల్లిదండ్రులను అడిగింది. వారు ఇచ్చారు. అందులో తనపై వార్డు బాయ్స్ అఘాయిత్యానికి పాల్పడినట్టు రాసింది.

దీంతో షాక్ అయిన కుటుంబసభ్యులు ఆమెను తీసుకుని సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. అక్కడ జరిగింది చెప్పారు. అయితే యువతి నోరు విప్పి మాట్లాడకపోవడంతో పోలీసులు లైట్ తీసుకున్నారు. ఇంతలో యువతి రాసిన లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే మీడియా కూడా దీన్ని పెద్దగా ప్రచారం చేయడంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. హైలెవల్ కమిటీతో విచారణకు ఆదేశిచారు. న్యాయం జరిగేలా చూస్తామన్నారు. స్వయంగా మంత్రి రంగంలోకి దిగడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. వెంటనే కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

దీనితో యువతీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆ ఆసుపత్రిలో పని చేసే వార్డు బాయ్స్ అందరిని పిలిపించారు. అందులో అఘాయిత్యానికి పాల్పడిన వారిని గుర్తించాలని యువతిని అడిగారు. అయితే అఘాయిత్యానికి ప్రయత్నించిన వారిలో వారందరూ ఉన్నారని యువతి చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. ప్రస్తుతం ఆమె మానసిక స్థితి సరిగా లేదని, అందుకే ఇలా చెబుతోందని అంచనాకు వచ్చారు. అయితే, అసలు అక్కడ అఘాయిత్యం జరిగిందా?లేదా? అలాగే ఆ యువతి మానసిక స్థితి ఏ విదంగా ఉందొ తెలియాలి అంటే వైద్యుల నుంచి రిపోర్టులు రావాల్సి ఉంది. దీనితో ఆ రిపోర్ట్స్ వచ్చే వరకు ఈ కేసులో ఓ క్లారిటీకి రాలేమని పోలీసులు చెబుతున్నారు.