Begin typing your search above and press return to search.
ఉరి వేసుకున్నట్టు వీడియో తీయబోతే..
By: Tupaki Desk | 31 May 2021 12:30 AM GMTకొంతమంది ఎలా తయారయ్యారంటే.. సెన్సేషన్ కోసం ఏం చేయడానికైనా వెనుకాడట్లేదు. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చేసేందుకు ఎర్రిపుష్పాల్లా బిహేవ్ చేస్తూ ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా చాలామందే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు ఉరివేసుకున్నట్టు వీడియో తీసేందుకు సిద్ధమయ్యారు.
షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని అప్పారెడ్డి గూడేనికి చెందిన జగన్, శ్రీను ఇద్దరు స్నేహితులు. లాక్ డౌన్ వేళ ఇంట్లో ఉండి బోర్ కొట్టిందేమో సమ్ థింగ్ డిఫరెంట్ ప్లాన్ చేద్దామని.. పిచ్చి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఉరి వేసుకున్నట్టు వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలనేది వారి ప్లాన్.
ఈ ప్లాన్ లో భాగంగా ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్టు వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఆశించినట్టుగానే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.. వైరల్ అయ్యింది. ఈ విషయం ఇద్దరు మిత్రుల్లోని జగన్ తల్లిదండ్రులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. ఆ తర్వాత ఈ వీడియో షూట్ చేసిన శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ కు పిలిచి కాస్త గడ్డిపెట్టారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే.. ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సరదా పేరుతో ఇలాంటి తింగరి వేశాలు వేయొద్దని బుద్ధిచెప్పారు.
షాద్ నగర్ నియోజకవర్గం పరిధిలోని అప్పారెడ్డి గూడేనికి చెందిన జగన్, శ్రీను ఇద్దరు స్నేహితులు. లాక్ డౌన్ వేళ ఇంట్లో ఉండి బోర్ కొట్టిందేమో సమ్ థింగ్ డిఫరెంట్ ప్లాన్ చేద్దామని.. పిచ్చి ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ఉరి వేసుకున్నట్టు వీడియో తీసి.. దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయాలనేది వారి ప్లాన్.
ఈ ప్లాన్ లో భాగంగా ఓ చెట్టుకు ఉరివేసుకున్నట్టు వీడియో తీసుకున్నారు. ఆ తర్వాత వారు ఆశించినట్టుగానే సోషల్ మీడియాలో పోస్టు చేశారు.. వైరల్ అయ్యింది. ఈ విషయం ఇద్దరు మిత్రుల్లోని జగన్ తల్లిదండ్రులకు తెలియడంతో తీవ్రంగా మందలించారు. ఆ తర్వాత ఈ వీడియో షూట్ చేసిన శ్రీనుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. స్టేషన్ కు పిలిచి కాస్త గడ్డిపెట్టారు. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే.. ప్రాణాలు పోతే ఎవరిది బాధ్యత అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సరదా పేరుతో ఇలాంటి తింగరి వేశాలు వేయొద్దని బుద్ధిచెప్పారు.