Begin typing your search above and press return to search.

త్రోబ్యాక్ః చిట్టి అనుష్క‌.. చిన్నారి సాక్షి..! ధోనీ-కోహ్లీ చూసి ఉంటారా?

By:  Tupaki Desk   |   23 April 2021 1:30 AM GMT
త్రోబ్యాక్ః చిట్టి అనుష్క‌.. చిన్నారి సాక్షి..! ధోనీ-కోహ్లీ చూసి ఉంటారా?
X
సెల‌బ్రిటీల విష‌యాల‌పై ఫ్యాన్స్ కు ఎప్పుడూ ఆస‌క్తే! వాళ్ల కెరీర్ తోపాటు ప‌ర్స‌నల్ అంశాల‌పై చాలా ఇంట్ర‌స్ట్ చూపిస్తుంటారు. ఇందులోనూ సినిమా, క్రికెట్ అభిమానుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ చిన్ని విష‌యాన్ని కూడా వ‌దిలిపెట్ట‌కుండా తెలుసుకోవాల‌ని చూస్తుంటారు. అలాంటి అభిమానుల‌కు ఆనందం క‌లిగించే ఫొటోనే ఇది!

ఇందులో రెండు స‌ర్కిల్స్ లో క‌నిపిస్తున్న‌వారు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న స్టార్స్ స‌తీమ‌ణులు. వీరిలో ఒక‌రు టీమిండియా మాజీ కెప్టెన్‌ మ‌హేంద్ర సింగ్ ధోనీ స‌తీమ‌ణి సాక్షి కాగా.. మ‌రొక‌రు ప్ర‌స్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ బెటర్ హాఫ్ అనుష్క శ‌ర్మ‌.

వీళ్లిద్ద‌రూ ఒకే ఫొటోలో ఎలా? అని ఆలోచిస్తున్నారా? ఒకే ఫొటోలో కాదు.. ఒకే బెంచ్ లో కూర్చున్నారు. అవును.. వీళ్లిద్ద‌రూ క్లాస్ మెట్స్‌. అస్సాంలోని ఓ స్కూళ్లో క‌లిసి చ‌దువుకున్నారు. అంతేకాదు.. మంచి ఫ్రెండ్స్ కూడా. అప్పుడు తీసుకున్న ఫొటోనే ఇది.

ఇక స్కూలింగ్ త‌ర్వాత కూడా వీరిద్ద‌రూ త‌ర‌చూ క‌లిసేవారు. క‌లిసి చ‌దువుకున్న ఈ ఫ్రెండ్స్‌.. క్రికెట‌ర్ల‌నే పెళ్లి చేసుకోవ‌డం యాదృశ్చికం. అంతేకాదు.. వాళ్లిద్ద‌రూ కెప్టెన్లు కావ‌డం విశేషం. ఇంకా.. వీళ్లిద్ద‌రూ ఆడ‌పిల్ల‌కే జ‌న్మ‌నివ్వ‌డం మ‌రింత విశేషం. ఇలా.. చాలా కామ‌న్ పాయింట్లు ఉన్నాయి ఈ స్టార్ వైఫ్స్ లో.

ఈ త్రోబ్యాక్ పిక్ ను అనుష్క శ‌ర్మ ఫ్యాన్స్ క్ల‌బ్ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో.. ఈ పిక్ ఇప్పుడు వైర‌ల్ అయ్యింది. షేర్ల మీద షేర్లు చేస్తున్న ఫ్యాన్స్‌.. సూప‌ర్బ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇదిలాఉంటే.. ఈ ఫొటోను కోహ్లీ-ధోనీ చూసి ఉంటారా? చూస్తే.. ఫస్ట్ టైమ్ వాళ్ల ఫీలింగ్ ఎలా ఉండొచ్చు?