Begin typing your search above and press return to search.

హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్

By:  Tupaki Desk   |   18 March 2023 3:09 PM GMT
హీరోయిన్ ను బ్లాక్ మెయిల్ చేసి రూ.10 కోట్లు డిమాండ్
X
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌ కు క్రిమినల్ కేసులో జోక్యం చేసుకుని బెదిరింపులకు పాల్పడినందుకు గాను డిజైనర్ అనీష్కా జైసింఘానిపై కేసు నమోదైంది. ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ముంబై కోర్టు మార్చి 21 వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ విధించింది. ఈ కేసులో నిందితుడైన ఆమె తండ్రి ఇంకా పరారీలో ఉండగానే అనిష్క ను గురువారం అరెస్టు చేశారు. అమృతా ఫడ్నవీస్ ఫిర్యాదుపై మలబార్ హిల్ పోలీస్ స్టేషన్ ఫిబ్రవరి 20న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.

ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం, అనిష్క గత 16 నెలలుగా అమృతా ఫడ్నవీస్‌ తో టచ్‌లో ఉంది. ఆమె నివాసానికి కూడా వెళ్లింది. అమృతా ఫడ్నవీస్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో, తాను మొదటిసారి నవంబర్ 2021లో అనిష్క ను కలిశానని చెప్పింది. తాను బట్టలు, ఆభరణాలు, పాదరక్షల డిజైనర్‌ ని అని అనీష్క తెలిపింది. పబ్లిక్ ఈవెంట్‌లలో వాటిని ధరించమని అమృతను అభ్యర్థించిందని, ఇది ఉత్పత్తులను ప్రమోట్ చేయడంలో తనకు సహాయపడుతుందని అమృత నమ్మిందని పోలీసు అధికారి తెలిపారు.

అమృతా ఫడ్నవీస్ నమ్మకాన్ని పొందిన తర్వాత అనీష్క తనకు కొంతమంది బుకీల సమాచారాన్ని అందించడానికి ఆఫర్ చేసింది. దాని ద్వారా వారు డబ్బు సంపాదించవచ్చని ఆమె పేర్కొంది. ఈ పోలీసు కేసులో తన తండ్రిని తప్పించడానికి ఆమె నేరుగా అమృత ఫడ్నవీస్ ₹1 కోటి ఇచ్చింది.

అమృతా ఫడ్నవీస్ కూడా అనీష్క ప్రవర్తనతో కలత చెంది ఆమె నంబర్‌ ను బ్లాక్ చేసినట్లు పోలీసులకు చెప్పినట్లు అధికారి తెలిపారు. ఆ మహిళ అమృత ఫడ్నవీస్ వీడియో క్లిప్‌లు, వాయిస్ నోట్స్ , అనేక సందేశాలను తెలియని నంబర్ నుండి పంపింది. ఆమె , ఆమె తండ్రి వీటిని పట్టుకొని అమృత ఫడ్నవీస్‌పై పరోక్షంగా బెదిరించారని.. కుట్ర చేశారని పోలీస్ అధికారి తెలిపారు.

అమృత ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద అనీష్క , ఆమె తండ్రిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు, ప్రభుత్వ ఉద్యోగిని లంచం తీసుకునేలా అవినీతి, అక్రమ మార్గాలను ఉపయోగించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.