Begin typing your search above and press return to search.
భూమా... అక్కా తమ్ముళ్లకు టీడీపీ సీనియర్ నేత షాక్.. `ఆళ్లగడ్డ`లో కలకలం!
By: Tupaki Desk | 12 Jun 2022 9:54 AM GMTకర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో తమకు తిరుగులేదని చెబుతున్న భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి అఖిల ప్రియారెడ్డి, ఆమె తమ్ముడు జగద్విఖ్యాత్రెడ్డిలకు టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ గట్టి షాక్ ఇచ్చారు. తాజాగా నిర్వహించిన ఓ సభలో భూమా కుటుం బంపై ఆయన చేసిన వ్యాఖ్యలు అక్కాతమ్ముళ్లను ఓ కుదుపు కుదిపేశాయి.
భూమా కుటుంబ రాజకీయ చరిత్ర తనకు తెలుసునని ఫరూక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబ పరిస్థితి కూడా తనకు తెలుసన్నారు. ``ఇంతకూ భూమా కుటుంబం అంటే ఎవరు? భూమా అంటూ ఇక్కడొకరు, అక్కడొకరు తిరుగుతున్నారు`` అంటూ. పరోక్షంగా అఖిలప్రియ, భూమా కిషోర్ల(అఖిల చిన్నాన్న కుమారుడు.) గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో భూమా అనుచరులెవరు, టీడీపీ కార్యకర్తలెవరిని ఫరూక్ గట్టిగా ప్రశ్నించారు.
భూమా భాస్కర్రెడ్డి, భూమా వీరశేఖర్రెడ్డిల వారసుడిగా నాగిరెడ్డిని ప్రజాభిప్రాయం మేరకు టీడీపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని గతంలో జరిగిన విషయాలను ఫరూక్ గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా అదే పంథాను అవలంబిస్తుందన్నారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా కుటుంబంలో (అఖిలప్రియ, కిషోర్) ఎవరనేది కార్యకర్తలే తేలుస్తారన్నారు. ఆ మేరకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఫరూక్ ప్రకటించి.. అక్కాతమ్ముళ్లకు షాక్ ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టికెట్ ఆశిస్తున్న భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత్రెడ్డిలు.. బలప్రదర్శన చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ముందుగా భూమా విఖ్యాత్రెడ్డి, అఖిలప్రియ ప్రసంగించారు. భూమా అంటే తామే అని ప్రకటించుకున్నారు.
జగత్ విఖ్యాత్రెడ్డి మాట్లాడుతూ తనకు ఎన్నికల్లో నిలిచే వయస్సు లేదని, కాబట్టి ఈ దఫా కూడా అక్క అఖిలప్రియే పోటీ చేస్తారన్నారు. అక్కైనా, తానైనా ఒకటే అన్నారు. అక్క గెలుపు కోసం పని చేయాలని కోరారు. భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా కుటుంబంలో చిచ్చుపెట్టి తనను ఓడించేందుకు గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయని ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో తన వాళ్లనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారన్నారు.
అక్కాతమ్ముళ్ల మాటలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపాయో లేదో తెలియదు కానీ.. ఆ తర్వాత ప్రసంగించిన ఫరూక్ చేసిన కామెంట్లు మాత్రం తీవ్రస్థాయిలో సంచలనం రేపుతున్నాయి. ఫరూక్ను పిలిపించుకుని మరీ.. విమర్శలు చేయించుకున్నట్టు అయిందని.. భూమా వర్గం భావిస్తోంది. మొత్తానికి భూమా అక్కా తమ్ముళ్లకు ఫరూక్ తనదైన శైలిలో షాక్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది.
భూమా కుటుంబ రాజకీయ చరిత్ర తనకు తెలుసునని ఫరూక్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబ పరిస్థితి కూడా తనకు తెలుసన్నారు. ``ఇంతకూ భూమా కుటుంబం అంటే ఎవరు? భూమా అంటూ ఇక్కడొకరు, అక్కడొకరు తిరుగుతున్నారు`` అంటూ. పరోక్షంగా అఖిలప్రియ, భూమా కిషోర్ల(అఖిల చిన్నాన్న కుమారుడు.) గురించి ప్రస్తావించారు. ఈ సమావేశంలో భూమా అనుచరులెవరు, టీడీపీ కార్యకర్తలెవరిని ఫరూక్ గట్టిగా ప్రశ్నించారు.
భూమా భాస్కర్రెడ్డి, భూమా వీరశేఖర్రెడ్డిల వారసుడిగా నాగిరెడ్డిని ప్రజాభిప్రాయం మేరకు టీడీపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చిందని గతంలో జరిగిన విషయాలను ఫరూక్ గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో కూడా అదే పంథాను అవలంబిస్తుందన్నారు. ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి భూమా కుటుంబంలో (అఖిలప్రియ, కిషోర్) ఎవరనేది కార్యకర్తలే తేలుస్తారన్నారు. ఆ మేరకు టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఫరూక్ ప్రకటించి.. అక్కాతమ్ముళ్లకు షాక్ ఇచ్చారు.
ఏం జరిగిందంటే..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో టికెట్ ఆశిస్తున్న భూమా అఖిల ప్రియ, ఆమె సోదరుడు జగద్విఖ్యాత్రెడ్డిలు.. బలప్రదర్శన చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ హాజరయ్యారు. ముందుగా భూమా విఖ్యాత్రెడ్డి, అఖిలప్రియ ప్రసంగించారు. భూమా అంటే తామే అని ప్రకటించుకున్నారు.
జగత్ విఖ్యాత్రెడ్డి మాట్లాడుతూ తనకు ఎన్నికల్లో నిలిచే వయస్సు లేదని, కాబట్టి ఈ దఫా కూడా అక్క అఖిలప్రియే పోటీ చేస్తారన్నారు. అక్కైనా, తానైనా ఒకటే అన్నారు. అక్క గెలుపు కోసం పని చేయాలని కోరారు. భూమా అఖిలప్రియ మాట్లాడుతూ భూమా కుటుంబంలో చిచ్చుపెట్టి తనను ఓడించేందుకు గుంటనక్కలన్నీ ఏకమవుతున్నాయని ఆరోపించారు. మంత్రిగా ఉన్న సమయంలో తన వాళ్లనుకున్న వాళ్లే వెన్నుపోటు పొడిచారన్నారు.
అక్కాతమ్ముళ్ల మాటలు పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపాయో లేదో తెలియదు కానీ.. ఆ తర్వాత ప్రసంగించిన ఫరూక్ చేసిన కామెంట్లు మాత్రం తీవ్రస్థాయిలో సంచలనం రేపుతున్నాయి. ఫరూక్ను పిలిపించుకుని మరీ.. విమర్శలు చేయించుకున్నట్టు అయిందని.. భూమా వర్గం భావిస్తోంది. మొత్తానికి భూమా అక్కా తమ్ముళ్లకు ఫరూక్ తనదైన శైలిలో షాక్ ఇచ్చారనే వాదన వినిపిస్తోంది.