Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్ లోకి

By:  Tupaki Desk   |   21 March 2023 10:01 PM GMT
ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్ లోకి
X
టీడీపీ వ్యవస్థాపకుడు , దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 వెండి నాణెం ముద్రణపై కేంద్రం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్, 5 శాతం జింకుతో నాణెం తయారీ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం త్వరలో మార్కెట్ లోకి రానుందని అధికారులు వెల్లడించారు.

లెజెండరీ సీనియర్ ఎన్టీఆర్ చిత్రపటాన్ని కేంద్ర ప్రభుత్వం , కేంద్ర మింట్ కొత్త రూ.100 నాణేన్ని ఇప్పటికే పరిచయం చేసింది. తాజాగా ఎన్టీఆర్ నాణేనికి సంబంధించిన అధికారిక గెజిట్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

సీనియర్ ఎన్టీఆర్ కొత్త పరిమిత-సరఫరా రూ.100 నాణెం అతి త్వరలో మార్కెట్లోకి ప్రవేశపెట్టబడుతుందని గెజిట్ ధృవీకరిస్తుంది. నాణెం 44 ఎంఎం వ్యాసం కలిగి ఉంటుంది. దీనిని ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ. 4160. ఈ నాణెంపై హిందీ , ఆంగ్ల భాషలలో సీనియర్ ఎన్టీఆర్ 100 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ముద్రించబడి ఉంటుంది. దానిపై 1923-2023 గుర్తు ఉంటుంది.

ఈ నాణెం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సమాజం గర్వించదగ్గ నిదర్శనంగా కేంద్రం పేర్కొంటోంది. ఎన్టీఆర్ త్వరలో దీన్ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.