Begin typing your search above and press return to search.

షాకిచ్చే వీడియో: రైలు పట్టాపై వరుస పెట్టి రాళ్లు.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   7 Jun 2023 9:00 PM GMT
షాకిచ్చే వీడియో: రైలు పట్టాపై వరుస పెట్టి రాళ్లు.. ఎక్కడంటే?
X
కొద్ది రోజులు గా పలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్న ఒక వీడియో ను తాజాగా కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ట్యాగ్ చేసిన వైనం కలకలంగా మారింది. రైల్వే ఉన్నతాధికారుల కు ట్యాగ్ చేసిన కేంద్ర మంత్రి.. ఈ విషయం చాలా సీరియస్ అని.. ఇదెక్కడ జరిగిందో తెలుసుకోవాలని.. కారణం పై వివరాలు తనకు అందజేయాలని కోరారు. ఇంత కీ ఆ వైరల్ వీడియో లో ఏమున్నదన్నది చూస్తే.. వణుకు పుట్టటం ఖాయం.

రైలు పట్టా పై వరుస పెట్టి పెద్ద రాళ్లను పేర్చుకుంటూ వెళ్లిన వైనం కనిపిస్తుంది. అయితే.. దీని కి కారణమైన ఒక కుర్రాడ్ని ఇద్దరు పట్టుకొని.. ఎందుకలా చేశావు? అని ప్రశ్నించటం.. దాని కి ఆ పిల్లాడు సమాధానం చెప్పకుండా ఏడవటం కనిపిస్తుంది. అయితే.. ఈ వీడియో కర్ణాటక కు చెందినదిగా చెబుతున్నారు.

పట్టాల మీద వరుసగా రాళ్లు పెట్టిన వైనాన్ని గుర్తించిన ఇద్దరు వ్యక్తులు.. వెంటనే స్పందించటం తో పెద్ద ప్రమాదం త్రుటి లో తప్పిందని చెబుతున్నారు. అయితే.. సదరు పిల్లాడు తనను ఎవరూ పట్టాల మీద రాళ్లు పెట్టమని అడగలేదని.. తనను పోలీసుల కు అప్పగించొద్దంటూ వేడుకోవటం వీడియో లో కనిపిస్తుంది. దీంతో ఆ కుర్రాడ్ని వదిలేస్తారు.

అనంతరం ఆ వీడియోలో.. పట్టాల వెంట రాళ్లు పెట్టిన వైనం చూసినప్పుడు మాత్రం ఒళ్లు గగుర్పాటు కు గురికావటం ఖాయం. ఈ మధ్యనే ఒడిశా లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకోవటం.. వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన ఉదంతం మిగిల్చిన విషాదం నుంచి తేరుకోకముందే.. బయటకు వచ్చిన ఈ వీడియో ఇప్పుడు షాకింగ్ గా మారింది.