Begin typing your search above and press return to search.

ఆకాశంలో అద్భుతం ... మిస్ అయితే మళ్లీ 2400 వ సంవత్సరం లో !

By:  Tupaki Desk   |   21 Nov 2020 11:50 AM GMT
ఆకాశంలో అద్భుతం ... మిస్ అయితే మళ్లీ 2400 వ సంవత్సరం  లో !
X
ఆకాశంలో చాలా అరుదుగా కొన్ని అద్భుత దృశ్యాలు కనువిందు చేస్తుంటాయి. అయితే ,అలాంటి అద్భుతాల్ని ఒక్కసారి చూడటం మిస్ అయితే , మళ్లీ జీవితంలో ఇక ఆ ఛాన్స్ రాకపోవచ్చు. అలా జీవితంలో మళ్లీ చూడలేని ఓ అద్భుత దృశ్యం , డిసెంబర్ 21 న కనువిందు చేయబోతుంది. రాబోయే నెలలో తొలిసారి శని, బృహస్పతి రెండుగ్రహాలు కలిసి ఒకేచోట డబుల్ ప్లానెట్ ‌గా దగ్గరగా కనిపించ నున్నాయి. డిసెంబర్ 21న సాయంత్రం సూర్యాస్తమయం 6 గంటల తరువాత ఈ అరుదైన దృశ్యాన్ని వీక్షించవచ్చు. భూమిపై నుంచి రాత్రి ఆకాశంలో చూస్తే బృహస్పతి శని గ్రహాలు ఒకదానికొకటి దగ్గరగా కనిపిస్తాయి. ఈ రెండు గ్రహాల మధ్య కలయిక చాలా అరుదుగా సంభవిస్తుంటుంది.

అయితే గ్రహాలు ఒకదానికొకటి ఇంత దగ్గరగా కనిపించడం చాలా అరుదుగా జరుగుతుందని రైస్ యూనివర్శిటీ ఖగోళ శాస్త్రవేత్త పాట్రిక్ హర్తిగాన్ చెప్పారు. 1226 సంవత్సరంలో మార్చి 4న తెల్లవారుజామున ఆకాశంలో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. వేసవి కాలం నుంచి బృహస్పతి, శని, భూ గ్రహాలు ఆకాశంలో ఒకదానికొకటి సమీపిస్తున్నాయి. డిసెంబర్ 21న సాయంత్రం ఈ రెండు గ్రహాలు డబుల్ ప్లానెట్ గా కనిపిస్తాయి. పూర్తి చంద్రుని వ్యాసంలో 1/5వ వంతు మాత్రమే వేరుగా కనిపిస్తాయని భౌతిక శాస్త్ర, ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ హర్తిగాన్ అన్నారు. ఆకాశంలో కనిపించే ఈ అరుదైన దృశ్యాన్ని టెలిస్కోప్ ద్వారా చూడొచ్చు.

భూమధ్యరేఖకు సమీపంలో ఉన్నప్పటికీ.. ఈ దృశ్యం భూమిపై ఎక్కడైనా కనిపించవచ్చు. ప్రతి సాయంత్రం సూర్యాస్తమయం తరువాత ఒక గంట పాటు పశ్చిమ ఆకాశంలో గ్రహ ద్వయం తక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. సంధ్యా సమయంలోనూ గ్రహాలను చూడగలిగేంత ప్రకాశవంతంగా ఉంటాయని చెబుతున్నారు. అమెరికాలో ఉండేవారికి ఈ అరుదైన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యాస్త సమయానికి ఒక గంట తరువాత, న్యూయార్క్ లేదా లండన్‌ లో ఆకాశంలో ఈ రెండు గ్రహాలను వరుసగా 7.5 డిగ్రీలు 5.3 డిగ్రీల కోణంలో దగ్గరగా చూడొచ్చు. ఈ రెండు గ్రహాలు మళ్లీ 2400 సంవత్సరం తర్వాత ఒకే చోట కనిపించే అవకాశం ఉంది.