Begin typing your search above and press return to search.

బాబు, లోకేష్, బాలయ్య గాలితీసిన రోజా

By:  Tupaki Desk   |   9 Dec 2019 10:48 AM GMT
బాబు, లోకేష్, బాలయ్య గాలితీసిన రోజా
X
నగరి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయకురాలు రోజా అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. మహిళల భద్రతపై చర్చ సందర్భంగా మైక్ నందుకున్న రోజా ఈ సందర్భంగా చంద్రబాబు హయాంలో సెక్స్ రాకెట్, అమ్మాయిలతో లోకేష్ గడిపిన ఫొటోలు, అమ్మాయి కనిపిస్తే కడుపు చేస్తానన్న బాలయ్య వ్యాఖ్యలను ఉదహరిస్తూ దుమ్మెత్తి పోశారు.

రోజా ప్రసంగిస్తుండగా టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుతగలడంతో మరింతగా రెచ్చిపోయారు. తాను ఎక్కడ చంద్రబాబు గారి హయాంలో చోటుచేసుకున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ ను బయటపెడుతాననే భయంతోనే ఆందోళన చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలో టీడీపీ నేతలు దాదాపు 200 మందిని సెక్స్ రాకెట్ కూపంలోకి నెట్టారని ఆరోపించారు.

ఇక మహిళల భద్రత గురించి మాట్లాడున్నామని.. ఈ కోవలోనే లోకేష్ అమ్మాయిలతో దిగిన ఫొటోల గురించి కూడా చర్చిస్తామని టీడీపీ నేతలు భయపడుతున్నారని రోజా ఎద్దేవా చేశారు. ఇక బాలక్రిష్ణ అమ్మాయి కనిపిస్తే కడుపు చేస్తానని అంటున్నాడని ఫైర్ అయ్యారు.

ఆడవాళ్ల మాన ప్రాణాల గురించి అసెంబ్లీలో చర్చిస్తుంటే చంద్రబాబు మాత్రం తన ఎమ్మెల్యేలతో ఆందోళన చేయిస్తున్నారని రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆలోచన మొత్తం లోకేష్ తినే పప్పులో ఉల్లిపాయ గురించే అని విమర్శించారు. ఆయనకు ఆడపిల్లలు ఉంటే వారి విలువ తెలిసుండేది అని మండిపడ్డారు. బాబు హయాంలో మహిళల భద్రతను గాలికి వదిలేసినందుకే ఆయనను మూలన కూర్చుండబెట్టారని రోజా ధ్వజమెత్తారు.

ఇక బాహుబలిలో తన భార్యను అవమానించిన మంత్రి తలను బాహుబలి నరికాడని.. ఏపీలో మహిళలను వేధిస్తే గన్ వచ్చేలోపే జగన్ శిక్షిస్తాడనే నమ్మకం కలిగిస్తామని రోజా చెప్పుకొచ్చారు. జగన్ ఒక ఎస్సీ మహిళను హోంమంత్రిని చేశారని.. మహిళల భద్రతకు జగన్ పెద్దపీట వేస్తున్నారని రోజా ప్రశంసించారు.