Begin typing your search above and press return to search.
ప్రియాంక కు షాకిస్తున్న పాక్...ఐరాసాకు ఫిర్యాదు
By: Tupaki Desk | 21 Aug 2019 4:51 PM GMTఆర్టికల్ 370 తొలగింపుతో భారత్ పై తీవ్రస్థాయికి చేరిన పాక్ పైత్యం మరింత విస్తృతం అవుతోంది. తాజాగా యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ - గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా విషయంలో మరో చీప్ ట్రిక్ ప్రయోగించింది. భారత బలగాలు పాకిస్థాన్ లో ఎయిర్ స్ట్రయిక్స్ చేసినప్పుడు ప్రియాంక ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. తాజాగా, కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ విధానాల్ని ఆమె సమర్థించారు. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను ప్రస్తావిస్తూ - యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని పాక్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ దేశ మానవ వనరుల మంత్రి షిరీన్ మజరి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు.
ఇటీవల లాస్ ఏంజెల్స్ లో బ్యూటీకాన్ పేరిట జరిగిన కార్యక్రమానికి ప్రియాంక చోప్రా అతిథిగా విచ్చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ పాకిస్థాని వివాదం సృష్టించారు. `యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ అయివుండి భారత బలగాలు పాకిస్థాన్ లో ఎయిర్ స్ట్రయిక్స్ చేసినప్పుడు ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. అలా రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేయొచ్చా? ఓ పాకిస్థానీ మహిళగా నేను - నా దేశవాసులు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం. అలాంటిది మీరు పాక్పై యుద్ధానికి దారితీసేలా వ్యాఖ్యలు చేయడం సబబేనా?’ అని ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ - ``నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు బాధ్యత - గౌరవం ఉన్నాయి. నేను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నావ్. నేను కూడా అంతే. ఇలా అరవకు. అరిచి నీ పరువు తీసుకోకు. `` అని ఘాటు కౌంటర్ ఇచ్చారు.
అయితే, ప్రపంచవ్యాప్త వేదికగా కార్యక్రమంలో పరువుపోవడంతో పాక్ గగ్గోలు పెడుతోంది. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసింది. ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్ కు లేఖ రాస్తూ ప్రియాంక చోప్రాను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల లాస్ ఏంజెల్స్ లో బ్యూటీకాన్ పేరిట జరిగిన కార్యక్రమానికి ప్రియాంక చోప్రా అతిథిగా విచ్చేశారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ పాకిస్థాని వివాదం సృష్టించారు. `యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ అయివుండి భారత బలగాలు పాకిస్థాన్ లో ఎయిర్ స్ట్రయిక్స్ చేసినప్పుడు ‘జై హింద్’ అని ట్వీట్ చేశారు. అలా రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేయొచ్చా? ఓ పాకిస్థానీ మహిళగా నేను - నా దేశవాసులు మీరు చేసే మంచి పనులకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచాం. అలాంటిది మీరు పాక్పై యుద్ధానికి దారితీసేలా వ్యాఖ్యలు చేయడం సబబేనా?’ అని ప్రశ్నించారు. దీనిపై ప్రియాంక స్పందిస్తూ - ``నేను భారతీయురాలిని. నా దేశం పట్ల నాకు బాధ్యత - గౌరవం ఉన్నాయి. నేను రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. నీ దేశం కోసం ఈ విధంగా నన్ను ప్రశ్నిస్తున్నావ్. నేను కూడా అంతే. ఇలా అరవకు. అరిచి నీ పరువు తీసుకోకు. `` అని ఘాటు కౌంటర్ ఇచ్చారు.
అయితే, ప్రపంచవ్యాప్త వేదికగా కార్యక్రమంలో పరువుపోవడంతో పాక్ గగ్గోలు పెడుతోంది. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితికి పిర్యాదు చేసింది. ఈ మేరకు పాక్ మానవహక్కుల శాఖ మంత్రి డా.షిరీన్ ఎం.మజారి ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ చీఫ్ హెన్రీట్టా హెచ్ ఫోర్ కు లేఖ రాస్తూ ప్రియాంక చోప్రాను యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ గా తొలగించాలని డిమాండ్ చేశారు.