Begin typing your search above and press return to search.

నందమూరి ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్.. వర్మ షాకింగ్ ట్వీట్

By:  Tupaki Desk   |   28 May 2023 10:12 PM GMT
నందమూరి ఫ్యామిలీలో ఒకే ఒక్క మగాడు తారక్.. వర్మ షాకింగ్ ట్వీట్
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తనకు తోచింది నలుగురికి చెప్పేస్తూ.. ఎవరేం అనుకున్నా తనకేం సంబంధం లేనట్లుగా వ్యవహరించే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నందమూరి కుటుంబంపై పడ్డారు. మొదట్నించి మోగా ఫ్యామిలీ మీదా.. అందునా పవన్ కల్యాణ్ మీద అదే పనిగా గురి పెట్టే ఆయన.. తాజాగా తారక్ ను పొగిడినట్లే పొగిడేసి.. భారీగా దెబ్బేశారన్న మాట వినిపిస్తోంది.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్ని విజయవాడలో దేవినేని నెహ్రూ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వర్మ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

నందమూరి తారక రామారావును చంపినోళ్లే ఇప్పుడు రక్తం తుడుచుకుని వచ్చి అభిషేకాలు చేస్తుంటే అంతకన్నా పెద్ద జోక్ మరొకటి లేదన్న వర్మ.. 'మీకో సీరియస్ జోక్ చెప్పటానికి వచ్చాను. ఎవరూ నవ్వలేని ఆ జోక్ ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతోంది. అది ఎంత పెద్ద జోక్ అంటే.. స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్ నవ్వాలో.. ఏడ్వాలో తెలియని జోక్. ఇక్కడ ఇంటి అల్లుడు అయిన వ్యక్తి చంద్రబాబును దారుణంగా టార్చర్ పెట్టి ఏడిపించి.. ఏడిపించి చంపారు. మళ్లీ ఇప్పుడు ఆయనే దండలు వేయటం జోక్' అని పేర్కొన్నారు.

రజనీకాంత్ కూడా చంద్రబాబు పక్కన కూర్చొని వాళ్లను పొగడటం అంటే ఆయన కూడా ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచినట్లేనని.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో లక్ష్మీ పార్వతి ఆయనకు సేవలు చేశారంటూ వర్మ వ్యాఖ్యానించారు. 'చాలా మంది ఎన్టీఆర్.. లక్ష్మీపార్వతి మాయలో పడ్డారంటారు. అంటే.. ఆయనకు అవగాహన లేదా? అలాంటప్పుడు ఆయనకు ఎందుకు దండలు వేస్తున్నారు?' అని ప్రశ్నించారు.

ఇంతవరకు ఒకలా మాట్లాడిన వర్మ.. అకస్మాత్తుగా సీన్లోకి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావనను తీసుకొచ్చారు. 'నందమూరి తారకరామారావు ఫ్యామిలీలో ఉన్న ఒకే ఒక్క మగాడు జూనియర్ ఎన్టీఆర్. తారక్ ఒక్కడే తాత మీదున్న గౌరవంతో వాళ్లతో పాటు వేదిక పంచుకోలేదు. అందుకు తారక్ కు నేను థ్యాంక్స్ చెబుతున్నా' అన్న రాంగోపాల్ వర్మ.. 2009లో ఇదే తారక్.. చంద్రబాబుతో వేదికను పంచుకోవటంతో పాటు..

బాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారాన్ని నిర్వహించిన విషయాన్ని వర్మ కన్వీనెంట్ గా మర్చిపోయారని చెప్పాలేమో? వర్మ ట్వీట్ దెబ్బకు.. తారక్ కు వర్మ కాంప్లిమెంట్ లభించటం తర్వాత.. ఇప్పటివరకు ఆయన్ను అభిమానించే నందమూరి ఫ్యామిలీ అభిమానులు ఆయనకు దూరమయ్యేప్రమాదం ఉందంటున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.