Begin typing your search above and press return to search.

మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాం.. సీక్రెట్‌గా మేం చేసేది చేస్తున్నాం

By:  Tupaki Desk   |   2 Jun 2023 7:00 PM GMT
మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాం.. సీక్రెట్‌గా మేం చేసేది చేస్తున్నాం
X
2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కి మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తామ‌ని.. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం తాము సీక్రెట్‌ గా వ‌చ్చే ఎన్నిక‌ల‌ కు సంబంధించి చేయాల్సింది చేస్తున్న‌ట్టు చెప్పారు. దేశంలో విపక్ష పార్టీలు ఐక్యంగానే ఉన్నాయని, క్షేత్రస్థాయిలో ఇందుకు అవసరమైన కార్యాచరణ జరుగుతోందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

క్షేత్రస్థాయిలో రహస్య మార్పులు జరుగుతున్నాయని, అంతా సీక్రెట్‌ గానే ఉంటుంద‌ని చెప్పారు. బ‌య‌ట‌కు వెల్ల‌డించ‌కుండా.. ఉండే ప‌రిస్థితిని మోడీనే సృష్టించుకున్నార‌ని రాహుల్ చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ప్రజల్నే ఆశ్చర్యపరుస్తాయని చెప్పారు. అమెరికాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ... వాషింగ్టన్లోని నేషనల్ ప్రెస్ క్లబ్లో మీడియాతో ముచ్చటించారు.

రాబోయే రెండేళ్లలో కాంగ్రెస్ మంచి పనితీరు కనబరుస్తుందని రాహుల్‌ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. 2024 ఎన్నిక‌ల్లో ఏం జరుగుతుందో చెప్పటానికి.. మరో మూడు, నాలుగు రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికల వరకు వేచి చూడాలన్నారు. ప్రతిపక్షాల పార్టీలతో మరింత ఐక్యత కోసం చర్చలు జరపుతున్నామ‌న్నారు. ఆ దిశగా మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని, అవ‌స‌ర‌మైతే.. ప్ర‌తిప‌క్షాల‌కు తాము పోటీ రాకుండా.. వ్య‌వ‌హ‌రిస్తామ‌ని చెప్పారు.

దేశంలో మతస్వేచ్ఛ, మీడియా స్వతంత్రత, మైనారిటీల సమస్యలు సహా వివిధ అంశాల పై రాహుల్ గాంధీ మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య సంస్థలను స్వాధీనం చేసుకుంటున్నారని అన్నారు. పత్రికాస్వేచ్ఛ పై నియంత్రణ ఉందని చెప్పారు. తనకు వినిపించినవన్నీ నిజాలేనని తాను నమ్మనని చెప్పుకొచ్చారు.

దేశంలోని వ్యవస్థలను బలహీనం చేశారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారన్న విషయం పై మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారం లోకి వస్తే.. సంస్థల స్వతంత్రత ను వెనువెంటనే పునరుద్ధరిస్తామ‌న్నారు. సీబీఐ, ఈడీ వంటివాటికి స్వేచ్ఛ‌ను ఇస్తామ‌న్నారు.