Begin typing your search above and press return to search.

రెండేళ్ల బుడతడికి 24 గంటలు గస్తీ కాస్తున్న పోలీసులు .. ఎక్కడ , ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   16 Jun 2021 11:30 AM GMT
రెండేళ్ల బుడతడికి 24 గంటలు గస్తీ కాస్తున్న పోలీసులు .. ఎక్కడ , ఎందుకంటే ?
X
అదొక పూరి గుడిసె .. ఆ గుడిసెకి పోలీసులు రోజులో 24 గంటల పాటు రక్షణ కల్పిస్తున్నారు. వామ్మో గుడిసె అయినప్పటికీ పోలీసులు 24 గంటల రక్షణ కల్పిస్తున్నారు అంటే అదొక బడా వ్యాపారవేత్త ఇల్లో , లేక కీలక రాజకీయ నేత ఫామ్ హౌసో అనుకునేరు కానే కాదు. గత కొద్ది రోజులుగా ఇక్కడ పెద్ద స్థాయిలో ప్రొటెక్షన్ పెట్టి , చీమ చిటుక్కుమన్నా పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఇంతకీ పోలీసులు ఈ రేంజ్ లో గస్తీ కాచేది ఎక్కడంటే .. గుజరాత్‌‌లోని గాంధీనగర్ పరిధిలోని అదలాజ్‌ ప్రాంతంలోని మురికివాడలో... అదేంటి ఓ మురికివాడ లో నివాసం ఉంటున్న ఓ గుడిసెలోని వారికి పోలీసులు ఎందుకు అంత రక్షణ కల్పిస్తున్నారు అంటే పూర్తిగా తెలుసుకోవాల్సిందే.

వివరాల్లోకి వెళ్తే .. గుజరాత్‌, గాంధీనగర్‌ లోని అదలాజ్‌ ప్రాంతంలోని మురికివాడలో చెత్త ఏరుకుంటూ జీవనం సాగించే దంపతులకు ఏప్రిల్‌ నెలలో మగబిడ్డ జన్మించాడు. పుట్టిన రెండురోజులకే ఆసుపత్రి నుంచి ఈ బుజ్జోడిని ఎత్తుకెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు వారంలోగా కిడ్నాప్‌ చేసిన నిందితులను పట్టుకుని ఈ చిన్నోడిని రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే , ఈ బుడతడు ఈ నెల 5 తేదీన మరోసారి కిడ్నాప్‌కు గురి అయ్యాడు. మరోసారి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. కేవలం నాలుగు రోజుల్లో కిడ్నాప్‌ను ఛేదించి వీడిని రక్షించారు. ఆస్పత్రిలోని సీసీ టీవి దృశ్యాల ఆధారంగా వారిని పట్టుకున్నారు. పిల్లలు లేని ఒక జంట బాలుణ్ని కిడ్నాప్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే రెండు సార్లు కిడ్నాప్‌ అయిన బాలుడికి ఇక మీదట ఎలాంటి అపాయం జరగకుండా చూసుకుంటామని పోలీసులు ఆ దంపతులకు హామీ ఇచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలుడి రక్షణ కోసం వాళ్లకు స్థిర నివాసం కూడా ఏర్పాటు చేస్తున్నారు.