Begin typing your search above and press return to search.

ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు ఫోన్ చేస్తున్నారా? ఇది చదవాల్సిందే

By:  Tupaki Desk   |   25 Nov 2020 4:15 AM GMT
ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు ఫోన్ చేస్తున్నారా? ఇది చదవాల్సిందే
X
చేతిలో ఇమిడిపోయే సెల్ ఫోన్ వచ్చాక.. దాన్ని వాడటమే ఎక్కువైంది. అయితే.. ఇప్పటికి ల్యాండ్ లైన్ ను వాడేవారు బోలెడంతమంది ఉంటారు. అలా వాడే వారంతా జనవరి 1 నుంచి కొత్తగా అమల్లోకి వస్తున్న నిబంధన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. టెలికమ్యునికేషన్ శాఖ తాజాగా తీసుకొచ్చిన నిబంధన ప్రకారం ల్యాండ్ లైన్ నుంచి మొబైల్ కు కాల్ చేయాలంటే కచ్ఛితంగా నెంబరుకు ముందు ‘‘0’’ను జత చేయాల్సిందే.

ఈ కొత్త నిబంధన జనవరి 1, 2021 నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించిన నిర్ణయాన్ని కేంద్రం తీసుకుంది. టెలికం రంగంలో మరిన్ని నెంబర్లను అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఒక్క టెలికం కంపెనీకి వర్తిస్తాయని స్పష్టం చేస్తున్నారు. డయిలింగ్ లో వచ్చే ఈ మార్పుతో అదనంగా చాలా నెంబర్లు టెలికం కంపెనీలకు అందుబాటులోకి రానున్నట్లుగా చెబుతుున్నారు. సో.. ల్యాండ్ లైన్ ను ఉపయోగించే వారంతా ఈ కొత్త నిబంధన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.