Begin typing your search above and press return to search.

భారత్ కు ఆగ్రహం తెప్పించేలా పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   5 July 2020 4:30 PM GMT
భారత్ కు ఆగ్రహం తెప్పించేలా పాక్ అధ్యక్షుడి వ్యాఖ్యలు
X
ప్రస్తుతం భారతదేశంతో చైనా కయ్యానికి కాలు దువ్వేలా వ్యవహరిస్తున్నది. ఈ రెండు దేశాల మధ్య కొన్ని వారాలుగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితి పాకిస్తాన్ కు తలనొప్పిగా మారింది. ఈ పరిణామం చైనా- కారిడార్ నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది.

దీనిపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ తాజాగా స్పందించాడు. ఈ క్రమంలోనే భారత్ కు ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యలు చేశారు. చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తామని ఇమ్రాన్ స్పష్టం చేశారు. దానికోసం ఎంత ఖర్చు అయినా సరే భరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ కారిడార్ ఏర్పడితే పాక్ అభివృద్ధికి మార్గం ఏర్పడుతుందని, దాని ఫలాలు ప్రతి పాకిస్తానీకి అందుతాయని తెలిపారు.

వాస్తవంగా ఈ కారిడార్ పూర్తయితే ఆ రెండు దేశాల మధ్య వర్తకం రోడ్డు మార్గంలో జరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనికోసం చైనా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. అయితే కొంతకాలంగా పీఓకేపై భారత్ బలపడుతున్నది. ఇప్పటికే ఆర్టికల్ 370 రద్దు.. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో పాక్ షాక్ కు గురయ్యింది. ఈ పరిణామంతో చైనా, పాక్ కారిడార్ ఏర్పాటుపై సమస్యలు ఏర్పడ్డాయి. ఈ కారిడార్ పీవోకే మీదుగా వెళ్తుంది. వివాదాస్పదంగా ఉన్న పీఓకేను ఇండియా తిరిగి స్వాధీనం చేసుకుంటే ఆ కారిడార్ పై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అందుకే ఇమ్రాన్ ఖాన్ పై వ్యాఖ్యలు చేశాడు.