Begin typing your search above and press return to search.

పాకిస్థాన్​ కొత్త రూల్స్​.. సోషల్​మీడియా సంస్థలకు దిమ్మతిరిగింది!

By:  Tupaki Desk   |   22 Nov 2020 1:50 PM GMT
పాకిస్థాన్​ కొత్త రూల్స్​.. సోషల్​మీడియా సంస్థలకు దిమ్మతిరిగింది!
X
పాకిస్థాన్​ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూల్స్​ చూసి ఫేస్​బుక్​, ట్విట్టర్​, గూగుల్ వంటి సంస్థలకు దిమ్మతిరిగిపోయింది. ఏ దేశంలో లేని విధంగా పాక్​ప్రభుత్వం విచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నదని వారు వాపోతున్నారు. నిబంధనల విషయంలో పాకిస్థాన్​ ప్రభుత్వం ఇలాగే మొండిగా ముందుకు పోతే .. తాము పాకిస్థాన్​లో ఉండలేమని ఆయా సంస్థలు తేల్చిచెబుతున్నాయి. ఇటీవల పాకిస్థాన్​ సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖ ప్రివెన్షన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ క్రైమ్ యాక్ట్ 201(PECA) కింద కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఈ నిబంధనలు ఎంతో కఠినంగా ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్ని అంశాలు ISP(ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు) వర్తింపచేయబడ్డాయి. ఇది టెక్ దిగ్గజాలకు ఆగ్రహం కలిగించింది.

పాకిస్థాన్​ తీసుకొచ్చిన నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయని.. వీటిని ఇలాగే కొనసాగిస్తే మేము పాకిస్థాన్​లో ఇంటర్నెట్​ సేవలు నిలిపేస్తామని ఆసియా ఇంటర్నెట్ కొలేషన్ (ఏఐసీ) హెచ్చరించింది. ఏఐసీలో ఫేస్‌బుక్, గూగుల్, ట్విట్టర్ సహా మరికొన్ని సంస్థలు ఉన్నాయి. పాకిస్థాన్​ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం.. సోషల్​ మీడియాలో మతం, ఉగ్రవాదం, అశ్లీలం, విద్వేషాలు రెచ్చగొచ్చే ప్రసంగాలు రావడానికి వీల్లేదు. వీటిపై పాకిస్థాన్​కు చెందిన ఓ అధికార యంత్రాగం నిరంతర పర్యవేక్షణ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సోషల్​మీడియా సంస్థలు ఈ నిబంధనలు ఉల్లంఘించారంటే 3.14 మిలియన్​ డాలర్ల జరిమానా విధిస్తారు.

మరోవైపు ప్రభుత్వం అడిగిన వెంటనే సోషల్​మీడియా సంస్థలు తమవద్ద ఉన్న సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వం అభ్యంతరం చెప్పిన పోస్టులను 24 గంటల్లోనే తొలగించాలి. 50 వేలు అంతకంటే ఎక్కుగా ఉన్న యూజర్లు ఉన్న సంస్థలు పాక్​ టెలికమ్యూనికేషన్​ అథారిటీలో రిజిస్టర్​ చేసుకోవాలి.

ఇస్లామాబాద్​లో శాశ్వతంగా ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలి.అయితే ఈ రూల్స్​పై సామాజిక మాధ్యమాలైన ఫేస్​బుక్​, ట్విట్టర్​, గూగుల్​ తీవ్రంగా మండిపడుతున్నాయి. ఇది వ్యక్తుల భావప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని వాళ్లు వాదిస్తున్నారు. దీనిపై పాకిస్థాన్​ సుప్రీంకోర్టులో తేల్చుకుంటామని స్పష్టం చేస్తున్నారు.