Begin typing your search above and press return to search.

నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్​వీ సీ -51 .. ఇస్రో ఖాతాలో మరోఘనత..!

By:  Tupaki Desk   |   28 Feb 2021 7:07 AM GMT
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్​ఎల్​వీ సీ -51 .. ఇస్రో ఖాతాలో మరోఘనత..!
X
ఇస్రో శాస్త్రవేత్తలు మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటికే వందలాది ప్రయోగలను విజయవంతంగా చేపట్టిన ఇస్రో మరో అరుదైన ఘనత సాధించింది. శాస్త్రవేత్తలు పీఎస్​ఎల్​వీ సీ -51 రాకెట్​ను విజయవంతంగా నింగిలోకి పంపించారు. ప్రైవేట్​ సంస్థల భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేసినట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెప్పారు.

మొత్తం 19 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు ఐస్రో చైర్మన్​ శివన్​ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సరిగ్గా 10.24 గంటలకు ధ్రువ ఉపగ్రహ ప్రయోగ వాహననౌక సీ51 (పీఎస్​ఎల్​వీ) నింగిలోకి వెళ్లింది.

ప్రయోగ వేదిక నుంచి రాకెట్​ 17 నిమిషాల పాటు పయనించి బ్రెజిల్​కు చెందిన అమోజోనియా శాటిలైట్​ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం నేపథ్యంలో షార్​లో పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేశారు. బ్రెజిల్​ దేశ సైన్స్​ అండ్​ టెక్నాలజీ మంత్రి మార్కోస్​ క్వాంటన్​ షార్​కు చేరుకొని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. పీఎస్​ఎల్​వీ సీ 51 వాహననౌక ద్వారా బ్రెజిల్​కు చెందిన అమెజోనియా-1 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపించారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.

అంతరిక్షంలోకి మోదీ ఫొటో..

ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి ప్రధాని మోదీ ఫొటో పంపించారు. మోదీ ఫొటో, ఆత్మనిర్భర్​ మిషన్​, భగవద్గీత కాపీ, వెయ్యిమంది విదేశీయుల పేర్లతోపాటు చెన్నైకి చెందిన విద్యార్థుల పేర్లను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో చైర్మన్​ శివన్​ హర్షం వ్యక్తం చేశారు.