Begin typing your search above and press return to search.
అప్పుడే ప్రారంభించిన పార్లమెంటులో.. కాంగ్రెస్ ఊహించిందే జరిగింది!!
By: Tupaki Desk | 29 May 2023 6:00 AMదాదాపు 1200 కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయంతో నిర్మించిన నూతన పార్లమెంటును ప్రారంభించి కొన్ని గంటలు కూడా గడవక ముందే.. ప్రధాని నరేంద్ర మోడీ సంచలనాత్మక పనిచేశారు. ఆది నుంచి విపక్ష కాంగ్రెస్ నేతలు ఊహించిన పనే ఆయన చేశారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవం రోజే వీడీ సావర్కర్ జయంతి కూడా రావడంతో పాత పార్లమెంటులోని సెంట్రల్ హాలులో సావర్కర్ చిత్రపటానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్చాలతో నివాళులు అర్పించారు.
మోడీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర సావర్కర్ త్యాగం, సాహసం, దృఢదీక్ష మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి "మన్ కీ బాత్'' కార్యక్రంలో కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ జయంతి ఈరోజు అని, సావర్కర్ జైలు జీవితం అనుభవించిన అండమాన్ జైలును దర్శించేందుకు తాను వెళ్లిన రోజు నేటికీ మరిచిపోలేనని అన్నారు.
నిర్భీతికి, ఆత్మగౌరవానికి సావర్కర్ ప్రతీక అని, బానసిత్వ ఆలోచనా విధానాన్ని ఆయన సహించేవారు కాదని మోడీ అన్నారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో చేసిన ట్వీట్లో, వీడీ సావర్కర్ తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. ఆయన దేశ భక్తి, త్యాగం, పట్టుదల ప్రశంసనీ యమనని అన్నారు. ఆ గుణాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.
కాగా, ఆది నుంచి కూడా కాంగ్రెస్ నతలు సావార్కర్ను దేశ ద్రోహిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. సావార్కర్పై రాహుల్ గాంధీ గతంలో విమర్శలు చేసిన సందర్భంలో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
మొత్తంగా పరిస్తితి కాంగ్రెస్ ఊహించినట్టే జరగడం.. తొలి రోజు పార్లమెంటు ప్రారంభించిన వెంటనే సావార్కర్కు నివాళులర్పించడం గమనార్హం. అయితే.. ఇదేసమయంలో గాంధీ, అంబేడ్కర్ ప్రస్తావనలు కనిపించకపోవడం విశేషం.
మోడీతో పాటు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీర సావర్కర్ త్యాగం, సాహసం, దృఢదీక్ష మనకు నిరంతర స్ఫూర్తిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి "మన్ కీ బాత్'' కార్యక్రంలో కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడైన వీర సావర్కర్ జయంతి ఈరోజు అని, సావర్కర్ జైలు జీవితం అనుభవించిన అండమాన్ జైలును దర్శించేందుకు తాను వెళ్లిన రోజు నేటికీ మరిచిపోలేనని అన్నారు.
నిర్భీతికి, ఆత్మగౌరవానికి సావర్కర్ ప్రతీక అని, బానసిత్వ ఆలోచనా విధానాన్ని ఆయన సహించేవారు కాదని మోడీ అన్నారు. కేవలం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడమే కాకుండా, సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం సావర్కర్ విశేషంగా కృషి చేశారని కొనియాడారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీలో చేసిన ట్వీట్లో, వీడీ సావర్కర్ తన ఆలోచనలతో అసంఖ్యాక భారతీయుల గుండెల్లో దేశ భక్తి ద్వీపాలను వెలిగించారని తెలిపారు. ఆయన దేశ భక్తి, త్యాగం, పట్టుదల ప్రశంసనీ యమనని అన్నారు. ఆ గుణాలు భావితరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు.
కాగా, ఆది నుంచి కూడా కాంగ్రెస్ నతలు సావార్కర్ను దేశ ద్రోహిగా పేర్కొంటున్న విషయం తెలిసిందే. సావార్కర్పై రాహుల్ గాంధీ గతంలో విమర్శలు చేసిన సందర్భంలో బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
మొత్తంగా పరిస్తితి కాంగ్రెస్ ఊహించినట్టే జరగడం.. తొలి రోజు పార్లమెంటు ప్రారంభించిన వెంటనే సావార్కర్కు నివాళులర్పించడం గమనార్హం. అయితే.. ఇదేసమయంలో గాంధీ, అంబేడ్కర్ ప్రస్తావనలు కనిపించకపోవడం విశేషం.