Begin typing your search above and press return to search.

తెలంగాణ ‘పుర’ పోరు ముగిసింది...ఎవరి బలం ఎంతంటే?

By:  Tupaki Desk   |   27 Jan 2020 5:30 PM GMT
తెలంగాణ ‘పుర’ పోరు ముగిసింది...ఎవరి బలం ఎంతంటే?
X
తెలంగాణలో మునిసిపల్ ఎన్నికల క్రతువు ఎట్టకేలకు ముగిసింది. పోలింగ్ లో ప్రశాంతంగానే ముగిసినా... ఆయా పురపాలక సంఘాలు - నగర పాలక సంస్థల పాలనా బాధ్యతలను చేజిక్కించుకునే సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలతో మునిసిపోల్స్ చివరాఖరులో ఉద్రిక్తతలు చోటుచేసకున్నాయి. అధికార పార్టీ, విపక్షాలు అన్న తేడా లేకుండా ఆయా పాలక వర్గాలను చేజిక్కించుకునేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ - బీజేపీలు అనుసరించిన వ్యూహాలు నిజంగానే ఆసక్తి రేకెత్తించాయి. అంతేకాకుండా... ఆయా ప్రాంతాల్లో పట్టు సాధించుకునేందుకు ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా బాహాబాహీకి దిగిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది. మొత్తంగా తొలుత ప్రశాంతంగా - చివర ఉద్రిక్త పరిస్థితులతో ముగిసిన తెలంగాణ ‘పుర’ పోరు ఎట్టకేలకు ముగిసింది.

‘పుర’ పోరు అంతిమ ఫలితాల్లో అధికార తెలంగాణ రాష్ట్రీయ సమితి(టీఆర్‌ ఎస్‌) దుమ్మురేపిందనే చెప్పాలి. 120 మున్సిపాలిటీలకు గానూ 112 దక్కించుకుని టీఆర్ ఎస్ సత్తా చాటింది. మిగిలిన 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నాలుగింటిని దక్కించుకోగా... బీజేపీ రెండు చోట్ల, ఎంఐఎం చోట్ల అధికార పీఠాలపై కూర్చున్నాయి. ఇకమరింత ఆసక్తికరంగా సాగిన నగర పాలక సంస్థల విషయంలో మొత్తం పది స్థానాలను కైవసం చేసుకుని టీఆర్ ఎస్... విపక్షాలను గట్టి దెబ్బే కొట్టేసిందని చెప్పాలి. నగర పాలక సంస్థల్లో ఒకటో - రెండో స్థానాలను దక్కించుకునేందుకు కాంగ్రెస్ - బీజేపీ పన్నిన వ్యూహాలను తుత్తునీయలు చేస్తూ టీఆర్ ఎస్ మొత్తం పది స్థానాలను కైవసం చేసుకోవడం గమనార్హం. జిల్లాల వారీగా ఆయా పార్టీలు దక్కించుకున్న మునిసిపాలిటీ వివరాలు కింది విధంగా ఉన్నాయి.

ఉమ్మడి నల్గొండ జిల్లా: 18 మున్సిపాలిటీల్లో ఒక్కస్థానం మినహా అన్నింటిని టీఆర్‌ ఎస్‌ కైవసం చేసుకుంది. చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్‌ దక్కించుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఓటు వివాదంతో నేరేడుచర్లలో మున్సిపల్‌ చైర్మన్‌ - వైస్‌ చైర్మన్‌ ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు.

1. నల్గొండ మున్సిపల్‌ చైర్మన్‌ గా మందడి సైదిరెడ్డి ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నిర మంగళవారానికి వాయిదా పడింది.

2. మిర్యాలగూడ మున్సిపల్‌ చైర్మన్‌ గా తిరునగరు భార్గవ్ - వైస్ చైర్మన్‌ గా కుర్ర కోటేశ్వరరావు ఎన్నిక

3. దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్‌ గా ఆలంపల్లి నర్సింహ్మ - వైస్ చైర్మన్‌ గా ఎం.డీ రహాత్ అలీ ఎన్నిక

4. నందికొండ-సాగర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా కర్ణ అనూష వైస్ చైర్మన్‌ గా మంద రఘువీర్ ఎన్నిక

5. హాలియా మున్సిపల్‌ చైర్మన్‌ గా వెంపటి పార్వతమ్మ - వైస్ చైర్మన్‌ గా సుధాకర్ ఎన్నిక

6. చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌ గా కోమటిరెడ్డి చిన వెంకటరెడ్డి - వైస్ చైర్మన్‌ గా కూరేళ్ల లింగస్వామి ఎన్నిక

7. చండూరు మున్సిపల్‌ చైర్మన్‌ గా తోకల చంద్రకళ (కాంగ్రెస్) - వైస్ చైర్మన్‌ గా దోటి సుజాత ఎన్నిక

8. భువనగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గా ఎనబోయిన ఆంజనేయులు - వైస్ చైర్మన్ చింతల కృష్ణయ్య ఎన్నిక

9. యాదగిరిగుట్ట మున్సిపల్‌ చైర్మన్‌ గా ఎరుకల సుధ ఎన్నిక

10. ఆలేరు మున్సిపల్‌ చైర్మన్‌ గా వసపరి శంకరయ్య ఎన్నిక

11. చౌటుప్పల్ మున్సిపల్‌ చైర్మన్‌ గా వెన్ రెడ్డి రాజు - వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం(సీపీఎం) ఎన్నిక

12. మోత్కూరు మున్సిపల్‌ చైర్మన్‌ గా టిపిరెడ్డి సావిత్రి - వైస్ చైర్మన్‌ గా బొల్లేపల్లి వెంకటయ్య ఎన్నిక

13. భూదాన్ పోచంపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ గా చిట్టిపోలు విజయలక్ష్మి - వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి ఎన్నిక

14. సూర్యాపేట మున్సిపల్‌ చైర్మన్‌ గా పెరుమాళ్ళ అన్నపూర్ణ - వైస్ చైర్మన్‌ గా పుట్ట కిషోర్ ఎన్నిక

15. కోదాడ మున్సిపల్‌ చైర్మన్‌ గా వనపర్తి శిరీష - వైస్ చైర్మన్‌ గా వెంపటి పద్మ ఎన్నిక

16. హుజూర్‌ నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా అర్చన రవి - వైస్ చైర్మన్‌ గా జక్కుల నాగేశ్వరరావు ఎన్నిక

17. తిరుమలగిరి మున్సిపల్‌ చైర్మన్‌ గా పోతరాజు రజిని ఎన్నిక

18. నేరేడుచర్ల మున్సిపల్‌ చైర్మన్‌ - వైస్‌ చైర్మన్‌ ఎన్నిక మంగళవారం జరుగుతుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా: 9 మున్సిపాలిటీల్లో అధికార టిఆర్ ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 9 చోట్ల కూడా టిఆర్ ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులే చైర్మన్ - వైస్ చైర్మన్ స్థానాలు దక్కించుకున్నారు.

1. వరంగల్ రూరల్ జిల్లా: పరకాల మున్సిపల్ చైర్మన్‌ గా సోదా అనిత - వైస్ చైర్మన్‌ గా రేగురి జైపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక.

2. వర్ధన్నపేట నూతన మున్సిపాలిటి ఛైర్ పర్సన్‌ గా అంగోత్ అరుణ - వైస్ చైర్మన్‌ గా కొమండ్ల ఏలందర్ రెడ్డి ఎన్నిక.

3. నర్సంపేట మున్సిపల్ చైర్మన్‌ గా గుంటి రజని కిషన్ - వైస్ చైర్మన్‌ గా మునిగాల వెంకట రెడ్డి ఎన్నిక.

4. మహబూబాద్ మున్సిపల్ చైర్మన్‌ గా డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి - వైస్ చైర్మన్‌ గా మహ్మద్ ఫరిద్ ఎన్నిక.

5. మహబూబాద్ జిల్లా: మరిపెడ మున్సిపల్ చైర్మన్‌ గా గుగులోతు సిందూర - వైస్ చైర్మన్‌ గా ముదిరెడ్డి బుచ్చిరెడ్డి ఎన్నిక.

6. డోర్నకల్ మున్సిపాలిటీ చైర్మెన్‌ గా వంకుడొతు వీరన్న - వైస్ చైర్మన్‌ గా కేసబోయిన కోటి లింగం ఎన్నిక.

7. మహబూబాబాద్ జిల్లా: తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య - వైస్ ఛైర్మన్‌ గా జినుగ సురేందర్ రెడ్డి ఎన్నిక.

8. భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపల్ చైర్మన్‌ గా సెగం వెంకట రాణి - వైస్ చైర్మన్‌ గా కొత్త హరిబాబు ఎన్నిక.

9. జనగామ జిల్లా: జనగామ మున్సిపల్‌ చైర్మెన్‌ గా పోకల జమున - వైస్ చైర్మన్‌ గా మేకల రాంప్రసాద్ ఎన్నిక.

ఉమ్మడి మెదక్ జిల్లా: 15 మున్సిపాలిటీల్లో టీఆర్‌ ఎస్‌ అభ్యర్ధులు చైర్మన్‌ పదవులను దక్కించుకున్నారు. బొల్లారంలో తప్ప అన్నిచోట్ల వైస్‌ చైర్మన్‌ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. బొల్లారంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అంతిరెడ్డిగారి అనిల్‌ రెడ్డి వైస్‌ చైర్మన్‌ గా ఎన్నికయ్యారు.

1. సంగారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ గా బొంగుల విజయలక్ష్మి - వైస్ చైర్మన్‌ గా లతారెడ్డి ఎన్నిక.

2. సదాశివపేట మున్సిపల్‌ చైర్మన్‌ గా పిల్లోడి జయమ్మ - వైస్ చైర్మన్‌ గా చింతా గోపాల్ ఎన్నిక.

3. ఆందోల్-జోగిపేట మున్సిపల్‌ చైర్మన్‌ గా గూడెం మల్లయ్య - వైస్ చైర్మన్‌ గా మాతరి ప్రవీణ్ కుమార్ ఎన్నిక.

4. నారాయణఖేడ్ మున్సిపల్‌ చైర్మన్‌ గా రూబీనా బేగం - వైస్ చైర్మన్‌ గా అయ్యర్ పరశురాం ఎన్నిక.

5. బొల్లారం మున్సిపల్‌ చైర్మన్‌ గా కోలన్ రోజారాణి - వైస్ చైర్మన్‌ గా అనిల్‌ రెడ్డి (కాంగ్రెస్‌) ఎన్నిక.

6. అమీన్‌ పూర్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌ గా తుమ్మల పాండు రంగారెడ్డి - వైస్ చైర్మన్‌ గా నందారం నర్సింహగౌడ్ ఎన్నిక.

7. తెల్లపూర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా మల్లేపల్లి లలిత - వైస్ చైర్మన్‌ గా బలాగౌని రాములు ఎన్నిక.

8. మెదక్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా తొడుపునూరి చంద్రపాల్ - వైస్ చైర్మన్‌ గా ఆరెల్ల మల్లికార్జున్ గౌడ్ ఎన్నిక.

9. నర్సాపూర్ చైర్మన్‌ గా ఎర్రగొల్ల మురళి యాదవ్ - వైస్ చైర్మన్‌ గా ఎండీ నయీముద్దిన్ ఎన్నిక.

10. తూప్రాన్ చైర్మన్‌ గా బొంది రవిందర్ గౌడ్ - వైస్ చైర్మన్‌ గా నందాల శ్రీనివాస్ ఎన్నిక.

11. రామాయంపేట చైర్మన్‌ గా పల్లె జితేంద్ర గౌడ్ - వైస్ చైర్మన్‌ గా పుట్టి విజయలక్ష్మి ఎన్నిక.

12. దుబ్బాక చైర్మన్‌ గా గన్నె వనిత - వైస్ చైర్మన్‌ గా సుగుణ బాలకిషన్ గౌడ్ ఎన్నిక.

13. చేర్యాల చైర్మన్‌ గా అంకుగారి స్వరూప రాణి - వైస్ చైర్మన్‌ గా నిమ్మ రాజీవ్‌ కుమార్ రెడ్డి ఎన్నిక.

14. గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌ చైర్మన్‌ గా నేతిచిన్న రాజమౌళి - వైస్ చైర్మన్‌ గా ఎండీ జకీరుద్దీన్ ఎన్నిక.

15. హుస్నాబాద్ చైర్మన్‌ గా ఆకుల రజిత - వైస్ చైర్మన్‌ గా అయిలేని అనిత ఎన్నిక.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా: 17 మున్సిపాలిటీల్లో 16 చోట్ల టీఆర్‌ ఎస్‌ పాగా వేసింది. కొల్లాపూర్‌ - అయిజ - భూత్పూర్‌ - కోస్గిలో మెజారిటీ సీట్లు లేకపోయినా చైర్మన్ - వైస్ చైర్మన్‌ పదవులను టీఆర్‌ ఎస్‌ దక్కించుకోవడం విశేషం. మక్తల్‌ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ మద్దతుతో కమలం వికసించింది. అమరచింత వైస్ చైర్మన్‌ గా సీపీఎం అభ్యర్థి గోపి ఎన్నికయ్యారు.

1. మహబూబ్‌ నగర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా కోరమోని నర్సింహులు - వైస్ చైర్మన్‌ గా గణేష్ ఎన్నిక.

2. భూత్పూర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా బస్వరాజ్ గౌడ్ - వైస్ చైర్మన్‌ గా కెంద్యాల శ్రీనివాస్ ఎన్నిక

3. అమరచింత మువ్సిపల్ చైర్మన్‌ గా మంగమ్మ - వైస్ చైర్మన్‌ గా గోపి (సీపీఎం) ఎన్నిక.

4. ఆత్మకూర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా గాయత్రి - వైస్ చైర్మన్‌ గా విజయ్ భాస్కర్‌ రెడ్డి ఎన్నిక.

5. కొత్తకోట మున్సిపల్‌ చైర్మన్‌ గా పొగాకు సుకేషిని - వైస్ చైర్మన్‌ గా బీసం జయమ్మ ఎన్నిక.

6. వనపర్తి మున్సిపల్‌ చైర్మన్‌ గా గాలి యాదవ్ - వైస్ చైర్మన్‌ గా వాకాటి శ్రీధర్‌ ఎన్నిక.

7. పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌ గా కరుణశ్రీ - వైస్ చైర్మన్‌ గా మేకల కర్రెస్వామి ఎన్నిక.

8. కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్‌ గా ఎడ్మ సత్యంరెడ్డి - వైస్ చైర్మన్‌ గా షాహీద్ ఎన్నిక.

9. కొల్లాపూర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా విజయలక్ష్మి - వైస్ చైర్మన్‌ గా మహదాబేగం ఎన్నిక.

10. నాగర్ కర్నూల్ మున్సిపల్‌ చైర్మన్‌ గా కల్పనా భాస్కర్ గౌడ్ - వైస్ చైర్మన్‌ గా భాస్కరరావు ఎన్నిక.

11. వడ్డేపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ గా కరుణ - వైస్ చైర్మన్‌ గా సుజాత ఎన్నిక.

12. అలంపూర్ మున్సిపల్‌ చైర్మన్‌ గా మనోహరమ్మ - వైస్ చైర్మన్‌ గా శేఖర్ ఎన్నిక.

13. అయిజ మున్సిపల్‌ చైర్మన్‌ గా దేవన్న - వైస్ చైర్మన్‌ గా మాల నర్సింహులు ఎన్నిక.

14. గద్వాల మున్సిపల్‌ చైర్మన్‌ గా బి.ఎస్ కేశవ్ - వైస్ చైర్మన్‌ గా బాబర్ ఎన్నిక.

15. నారాయణపేట జిల్లా: మక్తల్ మున్సిపల్‌ చైర్మన్‌ గా పావని(బీజేపీ) - వైస్ చైర్మన్‌ గా అఖిలారెడ్డి(బీజేపీ) ఎన్నిక.

16. కోస్గి మున్సిపల్‌ చైర్మన్‌ గా శిరీష - వైస్ చైర్మన్‌ గా అన్నపూర్ణ ఎన్నిక

17. నారాయణపేట మున్సిపల్‌ చైర్మన్‌ గా అనసూయ - వైస్ చైర్మన్‌ గా హరినారాయణ్ బట్టడ్‌ ఎన్నిక

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా: ఆరు మున్సిపాలిటీలను టీఆర్‌ ఎస్‌ పార్టీ గెలుచుకుంది. నిజామాబాద్‌ నగర పాలక సంస్థను ఎంఐఎం మద్దతుతో టీఆర్‌ ఎస్‌ కైవసం చేసుకుంది.

1. ఆర్మూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా పండిత్‌ వినీత్‌ - వైస్‌ చైర్మన్‌ గా మున్నాభాయ్‌ ఎన్నిక

2. బోధన్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా తూము పద్మ - వైస్‌ చైర్మన్‌ గా ఏతేషామ్‌ ఎన్నిక

3. భీంగల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గా మల్లెల రాజశ్రీ - వైస్‌ చైర్మన్‌ గా భగత్‌ ఎన్నిక.

4. కామారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ గా జాహ్నవి - వైస్‌ చైర్మన్‌ గా ఇందుప్రియ ఎన్నిక.

5. ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ గా సత్యనారాయణ - వైస్‌ చైర్మన్‌ గా సుజాత ఎన్నిక.

6. బాన్సువాడ మున్సిపల్‌ చైర్మన్‌ గా జంగం గంగాధర్‌ - వైస్‌ చైర్మన్‌ గా షేక్‌ జుబేర్‌ ఎన్నిక.