Begin typing your search above and press return to search.

నిమ్మగడ్డ రమేశ్​.. చంద్రబాబుకు ఉన్న బంధం బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!

By:  Tupaki Desk   |   25 Jan 2021 6:30 AM GMT
నిమ్మగడ్డ రమేశ్​.. చంద్రబాబుకు ఉన్న బంధం బయటపెట్టిన లక్ష్మీపార్వతి..!
X
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల సంఘం.. ప్రభుత్వానికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందేనని ఈసీ పట్టదలతో ఉంది. ప్రభుత్వం మాత్రం వ్యాక్సినేషన్​ తర్వాతే ఎన్నికలు పెట్టాలని చూస్తున్నది. ఈ క్రమంలో ప్రస్తుతం ఏపీలో ప్రతిష్ఠంభన నెలకొన్నది. అయితే ఈ తాజా పరిణామాలపై ఏపీ తెలుగు అకాడమీ చైర్మన్​ లక్ష్మీపార్వతి స్పందించారు. ఆమె ఏమన్నారంటే.. ‘నిమ్మగడ్డ రమేశ్​.. చంద్రబాబు కంబందహస్తాల్లో చిక్కుకుపోయాడు. చంద్రబాబు పంచన చేరినవాళ్లు ఎవరూ బాగుపడలేదు. నిమ్మగడ్డ పరిస్థితి కూడా అంతే. చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను సర్వనాశనం చేస్తున్నారు. ఎన్నికల సంఘం కమిషనర్​ నిమ్మగడ్డ రమేశ్​ నాకు చాలా కాలంగా తెలుసు. ఎన్టీఆర్​ హయాంలో నిమ్మగడ్డ ఎంతో బాధ్యతగా వ్యవహరించేవారు. ఇప్పుడు చంద్రబాబునాయుడు మాట విని భ్రష్టుపెట్టారు’ అని ఆమె పేర్కొన్నారు.

వ్యవస్థలు ప్రజల కోసం పనిచేయాలి తప్ప.. వ్యక్తుల కోసం కాదని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ రమేశ్​ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారడం బాధాకరమన్నారు. గతంలో ఎంతో మంచి పేరు సంపాధించిన నిమ్మగడ్డ ఇప్పుడు చంద్రబాబు మాటవిని భ్రష్టుపట్టారని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు అవినీతి చేయడం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని నీచరాజకీయాలు చేస్తున్నాడని చెప్పారు.