Begin typing your search above and press return to search.

కాంగ్రెస్‌-కేసీఆర్ డీఎన్ ఏ ఒక‌టే: కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   7 July 2023 3:02 PM
కాంగ్రెస్‌-కేసీఆర్ డీఎన్ ఏ ఒక‌టే: కిష‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
తెలంగాణ బీజేపీ న్యూ చీఫ్ కిష‌న్‌రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ-సీఎం కేసీఆర్ డీఎన్ ఏలు ఒక్క‌టేన‌ని వ్యాఖ్యానించారు. ఆరెండు పార్టీల మ‌ధ్య వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులు పొడిచే అవ‌కాశం ఉందా? అన్న ప్ర‌శ్న‌కు ఆయ‌న స్పందించారు. ''ఆ రెండు పార్టీల మ‌ధ్య ప్ర‌త్యేకంగా పొత్తులు అవ‌స‌రం లేదు. కేసీఆర్‌-కాంగ్రెస్ డీఎన్ ఏలు రెండు ఒక్క‌టే. క‌లిసి ప‌నిచేస్తారు.. క‌లిసిపోతారు'' అని అన్నారు.

ఇక‌, బీఆర్‌ఎస్, బీజేపీల మ‌ధ్య‌ ఎలాంటి పొత్తులు ఉండవని కిష‌న్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్ర‌దాన మంత్రి న‌రేంద్ర మోడీ వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న నేప‌థ్యంలో కిష‌న్‌రెడ్డి తాజాగా హ‌నుమ‌కొండ‌కు వ‌చ్చారు. ప్ర‌ధాన మంత్రి ఇక్క‌డ నిర్వ‌హించే స‌భ‌లోనూ పాల్గొంటున్నారు.

ఈ క్ర‌మంలో ఆయా ఏర్పాట్ల‌ను ప‌రిశీలిం చిన కిష‌న్‌రెడ్డి ప‌లు సూచ‌న‌లు చేశారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ ఎస్‌-బీజేపీ పొత్తు అవాస్త‌వ‌మ‌ని.. కొంద‌రు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించాల‌నే ల‌క్ష్యంతోనే ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు.

అస‌లైన స్నేహం కేసీఆర్‌-కాంగ్రెస్‌ల మ‌ధ్యే ఉంద‌ని అన్నారు. గ‌తంలో కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి అభ్యర్థి గెలుపు కోసం పని చేశారనే విష‌యాన్ని మీడియాకు గుర్తు చేశౄరు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లైనా.. పార్ల‌మెంటు ఎన్నిక‌లైనా ఆ రెండు పార్టీలు కలుస్తాయని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం పర్సంటేజీల ప్రభుత్వంగా మారిందని విమర్శించారు. వాటాల ప్రభుత్వంగా తయారైందని విమర్శించారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని ఫామ్ హౌస్‌కే పరిమితం చేయాల్సి ఉందని కిష‌న్‌రెడ్డి అన్నారు. కుటుంబ పార్టీల వల్ల దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయని విమ‌ర్శించారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇక్క‌డ కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డి.. మంచి పాలన రావాలని అన్నారు.