Begin typing your search above and press return to search.

ఇంటరెస్టింగ్..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సంతా వైసీపీలోకే

By:  Tupaki Desk   |   28 Jan 2020 1:30 AM GMT
ఇంటరెస్టింగ్..జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్సంతా వైసీపీలోకే
X
నిజమే... ఈ వార్త ఇంటరెస్టింగే. అంతేనా... అందరి దృష్టినీ విశేషంగా ఆకట్టుకునేదే. టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మవనడు, అచ్చూ ఆయన పోలికలతోనే రాణిస్తున్న టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కట్ట కట్టుకుని ఇప్పుడు ఏపీలో అధికార పార్టీగా ఉన్న వైసీపీలోకి చేరిపోతున్నారు. ఇలా తారక్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ... వైసీపీలో చేరిన వారు ఎంత మదో తెలుసా? ఒకరు కాదు... ఇద్దరు కాదు... ఏకంగా 1,500 మంది. అది కూడా ఏదో గుట్టు చప్పుడు కాకుండానో, లేదంటే... చడీచప్పుడు లేకుండా వైసీపీ కార్యాలయానికి వెళ్లో... వీరు వైసీపీ తీర్థం పుచ్చుకోలేదు. నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి... ర్యాలీగానే వైసీపీకి కార్యాలయానికి వెళ్లి వైసీపీ కండువాలు కప్పుకున్నారు.

అయినా ఇలా తారక్ ఫ్యాన్స్ ఇంత మంది ఎక్కడ వైసీపీలోకి చేరారు? అన్న వివరాలకల్లోకి వెళ్లిపోదాం పదండి. రాయలసీమ ముఖ ద్వారా కర్నూలులో సోమవారం వందలాది మంది తారక్ ఫ్యాన్స్ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి మరీ వైసీపీలో చేరారు. వీరిలో తారక్ ఫ్యాన్స్ తో పాటు తారక్ సోదరుడు కల్యాణ్ రాం ఫ్యాన్స్ కూడా ఉన్నారట. ఎన్టీఆర్, ఎన్కేఆర్ టైగర్ టీం జిల్లా అధ్యక్షుడు బోయపాటి మధు ఆధ్వర్యంలో తారక్, కల్యాణ్ రాం అభిమానులు 1,500 మంది వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.

కర్నూలు నగర శివారు నుంచి నగరంలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ దాకా భారీ ర్యాలీగా తరలివచ్చిన వీరికి కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత బోయపాటి మధుతో పాటు తరలివచ్చిన తారక్, కల్యాణ్ రాం ప్యాన్స్ కు మోహన్ రెడ్డి పార్టీ కండువాలు కప్పి వైసీపీలోకి ఆహ్వానించారు. ఈ ఘటన ఒక జిల్లాకు అందులోనూ ఒక నగరానికి చెందినదే అయినా... ఇలా తారక్ ఫ్యాన్స్ అని చెప్పుకుని మరీ వైసీపీలో చేరిపోయిన వైనం ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇదే తరహాలో మిగిలిన జిల్లాల్లోనూ తారక్ ఫ్యాన్స్ అంతా వైసీపీలోకి క్యూ కడతారేమో చూడాలి.