Begin typing your search above and press return to search.

కర్ణాటక సరిహద్దుల్లో సందిగ్ధం : నెగిటివ్‌ వస్తేనే అనుమతి .. కొత్త నిబంధనలతో వారికి కష్టమే ?

By:  Tupaki Desk   |   1 March 2021 6:30 AM GMT
కర్ణాటక సరిహద్దుల్లో సందిగ్ధం : నెగిటివ్‌ వస్తేనే అనుమతి .. కొత్త నిబంధనలతో వారికి కష్టమే ?
X
దేశ వ్యాప్తంగా మరోసారి కరోని విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకి కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర , కేరళ లో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కేరళ నుండి వచ్చే వారికి కఠిన నియమాలు అమలు చేస్తుంది. కేరళ నుండి కర్ణాటక లో అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని చెప్తూ సరిహద్దు ప్రాంతంలో ఆంక్షలు కఠినతరం చేసింది.

ఈ నిబంధనలు కాబోయే దంపతులకు చుక్కలు చూపిస్తున్నాయి. వధువు కర్ణాటక, వరుడు కేరళ, వివాహం కొడగు జిల్లా మడికేరిలో అయితే, వరుడు సహా వందలాది మంది బంధుమిత్రులు కరోనా నెగిటివ్‌ రిపోర్టు చూపించడం సాధ్యమేనా అని కేరళీయులు నిట్టూరుస్తున్నారు. కేరళ, మహారాష్ట్రలో కరోనా మళ్లీ పెరగడంతో అక్కడి నుంచి వచ్చే వారికి కొత్త నిబంధనను కర్ణాటక అమలు చేస్తోంది. కరోనా పరీక్ష నెగిటివ్‌ రిపోర్టు చూపిస్తేనే ఈ ఇరురాష్ట్రాల వారిని అనుమతిస్తారు. దీంతో చాలా మందికి ఇక్కట్లను తెచ్చిపెడుతోంది.

కొడగు జిల్లా మడికేరిలోని కడగదాళు గ్రామానికి చెందిన సుమతి అనే అమ్మాయి పెళ్లి కేరళలోని కాసరగోడు జిల్లాకు చెందిన ప్రమోద్‌ నాయర్‌తో నిశ్చయమైంది. మడికెరిలోని ఓంకారేశ్వర దేవాలయంలో పెళ్లి జరగాల్సి ఉంది. అయితే పెళ్లికొడుకు బృందంవారు కరోనా నెగిటివ్‌ రిపోర్టు తీసుకురావాల్సి రావడంతో సమస్య వచ్చి పడింది. అంతమందీ కరోనా పరీక్షలు జరిపించాలంటే సాధ్యమయ్యే పని కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పరీక్షలు చేయించుకున్నా 72 గంటల వరకు రిపోర్టులు రావని బంధువులు తెలిపారు. కుటుంబ సభ్యులే హాజరైతే 10–15 మంది ఉంటారని, వారికి ప్రైవేటు ఆస్పత్రిలో టెస్టులు చేయిస్తే కనీసం రూ. 25 వేలైనా ఖర్చు అవుతుందని తెలిపారు. కూలీనాలీ చేసి కూతురు పెళ్లి చేస్తున్న తమలాంటి సామాన్యులకు అంతటి భారం మోయడం కుదరని చెప్పారు. కేరళ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఇటువంటి ఉదంతాలు మరెన్నో ఉన్నాయి.