Begin typing your search above and press return to search.

అప్సర కేసులో అవాక్కయ్యే నిజాలు వెలుగులోకి!

By:  Tupaki Desk   |   9 Jun 2023 7:09 PM GMT
అప్సర కేసులో అవాక్కయ్యే నిజాలు వెలుగులోకి!
X
హైదరాబాద్‌ నగర పరిధి లోని శంషాబాద్‌ పరిధి లో నర్కుడ వద్ద జరిగిన మహిళ దారుణ హత్య కేసు ను పోలీసులు చేధించారు. ఈ కేసు లో విస్తుపోయే నిజాల ను వెలికి తీశారు. పెళ్లి చేసుకోవాలని వేధించడం తోనే పూజారి సాయికృష్ణ.. అప్సర ను దారుణం గా అంతమొందించాడని పోలీసులు తెలిపారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సరూర్‌ నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయాని కి సమీపం లో ఉన్న గుడి లో సాయికృష్ణ పూజారి గా పనిచేస్తున్నాడు. ఆ దగ్గర్లో నే శ్రీ వెంకటేశ్వర కాలనీ లో అతడు నివాసం ఉంటున్నాడు. గుడి పక్కనే ఉన్న ఇంటి లోనే అప్సర నివాసం ఉంటోంది. తరచూ గుడికి వచ్చే క్రమం లో అప్సర తో సాయికృష్ణ కు పరిచయం ఏర్పడింది. శంషాబాద్‌ గోశాల కు ఇద్దరూ కలిసే వెళ్లేవారు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ క్రమం లో అప్సర గర్భం కూడా దాల్చింది.

నిందితుడు పూజారి సాయికృష్ణ కే ఇదివరకే వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినా అప్సర.. అతడి ని ఇష్టపడింది. అయితే అప్సర తనను పెళ్లి చేసుకోవాల ని ఒత్తిడి చేస్తుండటం తోనే సాయికృష్ణ ఆమె ను అంతమొందించాలని నిర్ణయించాడు.

ఈ నేపథ్యంలో జూన్‌ 3న తాను కోయంబత్తూరు వెళ్తున్నానని, సాయికృష్ణ తన ను డ్రాప్‌ చేస్తాడని తల్లి కి చెప్పి ఇంట్లో నుంచి వెళ్లింది అప్సర. సాయికృష్ణ, అప్సర ఇద్దరూ కలిసి ఫోర్డ్‌ కారు లో శంషాబాద్‌ రాళ్లగూడ వైపు వెళ్లారు. అక్కడ భోజనం చేశారు. ఆ తర్వాత కారు లో ఫ్రంట్‌ సీట్‌ లో అప్సర నిద్ర లోకి జారుకుంది. ఇదే అదను గా ఆమె ను హత్య చేయడం కోసం తెచ్చిన బెల్లం దంచే దుడ్డుకర్ర తో అప్సర తలపై బాది చంపేశాడు. ఆపై కవర్‌ లో ఆమె డెడ్‌ బాడీ ని ఉంచి ఇంటి కి తీసుకొచ్చాడు. ఆ కారు ను రోజంతా ఇంటి ముందే పార్క్‌ చేశాడు. ఆ మరుసటి రోజు సరూర్‌ నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం వెనుక మ్యాన్‌హోల్‌ లో అప్సర మృతదేహాన్ని పడేసి.. పైన మట్టి కప్పి వెళ్లిపోయాడు.

ఆ తర్వాత తన కు ఏమీ తెలియదన్నట్టు ఈ నెల 5వ తేదీన తన అక్క కూతురు కనిపించకుండా పోయిందని సాయికృష్ణ పోలీసుల ను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. అయితే.. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల పుటే జీ ఆధారంగా సాయికృష్ణే హంతకుడ ని పోలీసులు తేల్చారు.

సరూర్‌ నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయ సమీపం లోని మ్యాన్‌ హోల్‌ లో నుండి అప్సర మృతదేహాన్ని పోలీసులు తాజాగా వెలికి తీశారు. డెడ్‌ బాడీ ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రి కి తరలించారు.

కాగా అప్సర రెండోసారి గర్భం దాల్చిందని.. ఈ విషయం లోనే ఇద్దరి మధ్య గొడవ జరిగిందని భావిస్తున్నారు. అయితే ఈ గర్భానికి తాను కారణం కాదని.. ఇతరుల తో చనువుగా ఉండటం వల్లే గర్భం దాల్చి ఉంటుందని సాయికృష్ణ అనుమానించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతే కాకుండా పెళ్లి చేసుకోవాల ని ఒత్తిడి చేస్తుండటంతో ఆమె ను హత్య చేశాడని భావిస్తున్నారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని చెబుతున్నారు. కాగా సాయికృష్ణ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.