బ్రేకింగ్ : ప్రపంచకప్ గెలిచిన టీమిండియా

Sun Jan 29 2023 20:06:39 GMT+0530 (India Standard Time)

Indian Team Creates History Wins Maiden U 19 World Cup

ఆదివారం జరిగిన తొలి ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 68 పరుగులకే ఇంగ్లండ్ను కట్టడి చేసి ఈజీగా లక్ష్యం ఛేదించి గెలిచేసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ మరోసారి భారత్ ధాటికి బెంబేలెత్తిపోయింది.  తడబడిన ఇంగ్లండ్ ఏ దశలోనే భారత యువతులకు పోటీనివ్వలేకపోయింది.  దీంతో మన టీమిండియా మహిళలు తమ తొలి ట్రోఫీని ఈజీగా గెలిచేశారు.



టైటాస్ సాధు ఆరంభంలోనే ఇంగ్లండ్ ను దెబ్బతీసి వికెట్ల పతానాన్ని శాసించింది. మొదటి ఓవర్లోనే ఇన్-ఫార్మ్ ఇంగ్లండ్ బ్యాట్స్ ఉమెన్ లిబర్టీ హీప్ని ఔట్ చేసి షాకిచ్చింది. ఆఫ్ స్పిన్నర్ అర్చన దేవి కూడా బాగా బౌలింగ్ చేసి ఇంగ్లండ్ను ఆరంభంలోనే దెబ్బతీసింది. ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్కు భారత్ బౌలింగ్ కు సమాధానాలు లేకుండా పోయాయి. మిగిలిన బౌలర్లు రెగ్యులర్ వికెట్లు తీయడంతో కేవలం 68కే ఇంగ్లండ్ ఔట్ అయ్యింది. ఫైనల్ లో ఇలా భారత్ ధాటికి తోకముడిచింది.

69 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆరంభంలోనే షఫాలీ వర్మన్ శ్వేతా సెహ్రావత్లను కోల్పోయింది. కానీ G త్రిష మరియు సౌమ్య తివారీ భారతదేశాన్ని ఇంటికి నడిపించడానికి ఒక ఘనమైన భాగస్వామ్యాన్ని నిర్మించారు.

ఇంగ్లండ్ మహిళలపై భారత మహిళలు 7 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలి మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచారు. ఇంగ్లండ్-వుమెన్స్ బౌలింగ్లో 68 పరుగులకే ఆలౌట్ అయిన తర్వాత ఇండియా వుమెన్స్  69 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించారు. ఇంగ్లండ్ మహిళలపై ఛేజింగ్లో భారత్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది. కెప్టెన్ షఫాలీ వర్మ మరియు ప్రధాన రన్ స్కోరర్ శ్వేతా సెహ్రావత్ అయితే సౌమ్య తివారీ మరియు గొంగడి త్రిష నిలబడ్డారు. స్కోరు నెమ్మదిగా చేసి గెలుపు వైపు నడిపించారు.  చివరికి తివారీ భారత శిబిరంలో ఆనందాన్ని నింపుతూ స్కోరు చేయడంతో విజయం దిశగా నడిపించారు.

అంతకుముందు టిటాస్ సాధు అర్చన దేవి మరియు పార్షవి చోప్రా తలో 2 వికెట్లు తీయగా మన్నత్ కశ్యప్ షఫాలీ వర్మ మరియు సోమన్ యాదవ్ తలా ఒక వికెట్ తీసి ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే ఔట్ చేశారు. భారత బౌలర్ల ధాటికి కేవలం 4 ఇంగ్లండ్ బ్యాటర్లు మాత్రమే రెండంకెల నమోదు చేయగలిగారు. రాయనా మక్డోనాల్డ్-గే 19 పరుగులతో అత్యధిక స్కోరు సాధించారు. న్యూజిలాండ్పై 8 వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత జట్టు భారీ విజయం తర్వాత ఫైనల్స్లోకి ప్రవేశించింది. మరోవైపు ఇంగ్లండ్ తక్కువ స్కోరుతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఫైనల్ లో ఈ రెండూ జట్లు తలపడగా.. భారత్ ఏకపక్షంగా విజయాన్ని అందుకుంది.