Begin typing your search above and press return to search.

అగ్ని-5 క్షిపణి పరీక్ష సక్సెస్.. చైనాకు వార్నింగ్!

By:  Tupaki Desk   |   28 Oct 2021 5:27 AM GMT
అగ్ని-5 క్షిపణి పరీక్ష సక్సెస్.. చైనాకు వార్నింగ్!
X
ఉపరితలం నుంచి ఉపరితలంలోకి ప్రయోగించే అగ్ని-5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ బుధవారం విజయవంతం గా పరీక్షించింది. 5,000 కిలో మీటర్లకు పైగా నిర్దేశిత లక్ష్యాన్ని ఆగ్ని-5 ఖచ్చితత్వం తో చేరుకుంది. సరి హద్దుల్లో మరోసారి చైనా రెచ్చగొట్టే చర్యల కు దిగుతున్న వేళ, తాజా ప్రయోగం తో భారత్ గట్టి సందేశం పంపింది. అగ్ని-5 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి లేదా ఐసీఎంబీ ని బుధవారం రాత్రి 7.50 గంటల కు ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలామ్ దీవి నుంచి విజయవంతం గా ప్రయోగించారు. మూడు-దశల ఘన ఇంధనం తో కూడిన ఇంజిన్‌ ను ఉపయోగించే ఈ క్షిపణి.. అత్యంత ఎక్కువ ఖచ్చితత్వం తో లక్ష్యాల ను ఛేదించగలదు.

భారత్ విధానాని కి అనుగుణం గా ‘విశ్వసనీయమైన కనీస నిరోధం కలిగి ఉన్న’ అగ్ని-5 పరీక్ష విజయవంతం కావడం తో తొలుత ఉపయోగించలేమనే నిబద్ధత ను బలపరుస్తుంది. జలాంతర్గామి ఆధారిత అణు క్షిపణుల తో పాటు భారత అణు నిరోధకానికి ఈ క్షిపణి పునాది. ఈ శ్రేణి కి దగ్గర గా ఇంకా ఎటు వంటి పరీక్షలు నిర్వహించ లేదు. ఇది లా ఉండగా, ఈ ఖండాతర క్షిపణిని డీఆర్‌డీఓ, భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ సంయుక్తం గా అభివృద్ధి చేశాయి. వాస్త వానికి అగ్ని-5 పరీక్ష 2020 లోనే జరగాల్సి ఉండ గా.. కరోనా వైరస్‌ విజృంభణ తో వాయిదా పడింది. అగ్ని రకం క్షిపణి ని భారత్ తొలి సారి 2012 లో విజయవంతం గా పరీక్షించిన విషయం తెలిసిందే. అగ్ని-1 700 కి.మీ., అగ్ని-2 2,000 కి.మీ., అగ్ని-3 2,500 కి.మీ., అగ్ని-4 3,500 కిలోమీటర్ల లక్ష్యాలను చేధించగల సామర్థ్యం లో రూపొందించారు.

ఈ పరీక్షలన్నీ విజయవంతమయ్యాయి. అయితే, తాజా గా పరీక్షించిన అగ్ని-5 క్షిపణి 5వేల నుంచి 8వేల కిలోమీటర్ల దూరం లో ఉన్న లక్ష్యాల ను విజయవంతం గా ఛేదించనున్నట్లు సమాచారం. కానీ, దీని కి సంబంధించి ఎటువంటి సమాచారం సంబంధిత వర్గాలు వెల్లడించారు. ఏది ఏమైనా తాజా ప్రయోగం తో భారత్ శక్తి ప్రపంచానికి మరో సారి తెలిసినట్టయ్యింది. పరీక్ష కు సంబంధించిన రెండు ముఖ్య మైన అంశాల లో ఒకటి ట్రై-సర్వీసెస్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ద్వారా సాయుధ దళాల లోకి ప్రవేశించిన మొట్ట మొదటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ఇది. రెండు, ఇంత కు ముందు ఏడుసార్లు పరీక్షించిన క్షిపణిని రాత్రి సమయం లో ప్రయోగించడం ఇదే తొలిసారి.

బుధవారం 1.5 టన్నుల వార్‌హెడ్‌ తో కూడిన క్షిపణిని ఒడిశా తీరం లోని ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి రాత్రి 7.50 గంటల కు ప్రయోగించారు. ధ్వని కంటే 24 రెట్లు వేగం తో దూసుకెళ్తున్న ఈ క్షిపణి బంగాళాఖాతం లో కూలడానికి ముందు రాడార్లు, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ సిస్టమ్‌లు, టెలిమెట్రీ స్టేషన్లు, నౌకల ద్వారా దాని మార్గం, విమాన పారామీటర్స్‌ ను నిరంతరం పర్యవేక్షించినట్టు అధికారి తెలిపారు.