Begin typing your search above and press return to search.

భారత్ - పాక్ మ్యాచ్ .. వైరల్ గా ఆ యాడ్ !

By:  Tupaki Desk   |   15 Oct 2021 9:05 AM GMT
భారత్ - పాక్ మ్యాచ్ .. వైరల్ గా ఆ యాడ్ !
X
ఐపీఎల్ .. గత కొన్ని రోజులుగా క్రికెట్ అభిమానులని ఆకట్టుకుంటున్న ఐపీఎల్ 2021 సీజన్ ఈ రోజు తో ముగియబోతుంది. కరోనా కారణంగా ఐపీఎల్ మధ్యలోనే ఆగిపోయినా ఆ తర్వాత మళ్లీ యూఏఈ వేదికగా ఐపీఎల్ సెకండ్ ఎడిషన్ ప్రారంభమైంది. ఈ రోజు ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్ కత్తా నైట్ రైడర్స్ అమితుమీ తేల్చుకోనున్నారు. ఇక ఐపీఎల్ 2021 సీజన్ ముగియగానే , మళ్లీ 17 వ తేదీ నుండి టి 20 ప్రపంచ కప్ ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్. అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది.

ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంత వ‌ర‌కూ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియాపై గెల‌వ‌ని పాకిస్థాన్ ఈసారి ఎన్నో ఆశ‌ల‌తో బ‌రిలోకి దిగుతోంది. ఆ టీమ్ వెంట ప‌టాకులు ప‌ట్టుకొని ఆ అభిమాని కూడా వ‌చ్చేశాడు. ఈసారి దుబాయ్‌లో గెలుపు ప‌క్కా అంటూ టీవీ కొనడానికి వచ్చాడు. ఇది ఒక యాడ్ , ఈ లేటెస్ట్ యాడ్‌ ను బ్రాడ్‌కాస్ట‌ర్ స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. కాస్త ఫ‌న్నీగా, ప్ర‌త్య‌ర్థిని స‌ర‌దాగా ఏడిపించేలా ఈ ప్రోమో రూపొందించారు. టీ20 వ‌ర‌ల్డ్‌ క‌ప్‌ లో ఇండోపాక్ మ్యాచ్ చూడటానికి ఓ పేద్ద టీవీ కొన‌డానికి త‌న ఫ్రెండ్ షోరూమ్‌కు ప‌టాకులు ప‌ట్టుకొని వ‌స్తాడు ఆ పాక్ అభిమాని. ఈ సంద‌ర్భంగా ఆ టీవీ షోరూమ్ ఓన‌ర్‌.. అత‌న్ని ఆట ప‌ట్టిస్తాడు. అతని చేతిలో రెండు టీవీలు పెడతాడు.

రెండు టీవీలు ఎందుకని పాక్‌ అభిమాని అడుగుతాడు. దానికి ఇండియా అభిమాని.. ఏం లేదు.. ఒక టీవీ మ్యాచ్‌ చూడడానికి.. మరొకటి పగులగొట్టడానికని సమాధానమిస్తాడు. అంటే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాదే విజయం అంటూ పరోక్షంగా చెప్పాడు. దీనికి ఇండియా అభిమాని ''బై వన్‌.. బ్రేక్‌ వన్‌'' ఆఫర్‌ చెప్పడంతో మౌకా.. మౌకా అంటూ యాడ్‌ ముగుస్తుంది. ప్రస్తుతం మౌకా- మౌకా యాడ్‌ సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. ముఖ్యంగా ఇండియ‌న్ ఫ్యాన్స్ ఈ ప్రోమోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక, వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకు పాకిస్ధాన్ మీద అజేయ రికార్డు ఉంది. 12-0 తేడాతో భారత్ పాకిస్థాన్ కు అందనంత ఎత్తులో ఉంది. ఇక, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్.చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌ లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం భారత్.. పాక్‌కు వెళ్లింది.