Begin typing your search above and press return to search.

ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందట .. ఎక్కడంటే !

By:  Tupaki Desk   |   24 Jan 2021 12:30 AM GMT
ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందట .. ఎక్కడంటే !
X
'అప్పట్లో పెద్దలు ఇసుక నుండి తైలంబు తీయవచ్చు అని చెప్పేవారు. కానీ , ఆ పెద్దలు చెప్పిన మాటలు నిజం అవుతాయో లేదో కానీ ఇసుక తో బంగారం వస్తుందంటూ ఓ మోసగాడు ముంచేశాడు. ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందని ఓ కేటుగాడు చెప్పిన మాటలు నమ్మి మహారాష్ట్రలోని పూణెకి చెందిన ఓ వ్యాపారి రూ.50 లక్షలు అప్పలంగా వాడి చేతిలో పెట్టి , ఆ తర్వాత మోసపోయాను అని తెలుసుకొని లబోదిబోమంటున్నాడు.

పూణెలోని హదాస్ పూర్ కు చెందిన ఓ నగల వ్యాపారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏడాది క్రితం ఆ వ్యాపారి షాపుకు వెళ్లిన ఓ వ్యక్తికి, వ్యాపారితో రాను రాను పరిచయం పెరిగింది. ఆ వ్యాపారి కుటుంబంతోనూ స్నేహం ఏర్పడింది. ఆ క్రమంలోనే అతడి ఇంటికి పాల ఉత్పత్తులను నిందితుడు సరఫరా చేసేవాడు. అయితే, ఓ రోజు 4 కిలోల ఇసుక సంచిని తీసుకొచ్చి నగల వ్యాపారికి ఇచ్చాడు.

పశ్చిమ బెంగాల్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన ఇసుక అని, వేడి చేస్తే బంగారం అవుతుందని నమ్మించాడు. అతడి మాటల్లో మోసాన్ని గ్రహించలేకపోయిన వ్యాపారి.. నిజమే కావొచ్చు అనుకుని రూ.30 లక్షలు, రూ.20 లక్షల విలువైన బంగారం ముట్టజెప్పాడు. తర్వాత ఆ ఇసుకను వేడి చేసిన వ్యాపారి.. తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.