Begin typing your search above and press return to search.

హైకోర్టు నోటీసుల‌తో చిక్కులో జన‌సేన‌ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   22 Oct 2019 1:12 PM GMT
హైకోర్టు నోటీసుల‌తో చిక్కులో జన‌సేన‌ ఎమ్మెల్యే
X
జ‌న‌సేన‌కు ఉన్న ఒక్క‌గానొక్క ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌ కు హైకోర్టు ఝ‌ల‌క్ ఇచ్చింది. జ‌నసేన పార్టీ వాయిస్‌ ను అసెంబ్లీలో వినిపించే ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఒక్క‌రు. ఈ ఉన్న ఒక్క సీటుతో ఏపీ అసెంబ్లీలో త‌న వాణిని - బాణీని వినిపిస్తు ప‌రువు కాపాడుకుంటోంది జ‌న‌సేన‌. అయితే ఈ ఎమ్మెల్యే ఇప్పుడు చిక్కుల్లో ప‌డ్డారు. హైకోర్టు జ‌న‌సేన ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేయ‌డంతో అస‌లు ఈ ఎమ్మెల్యే ప‌ద‌వి ఉంటుందా.. లేకు ఊడుతుందా అనే సందేహం వ్య‌క్తం అవుతుంది.

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు గెలిచారు. ఎస్సీ సామాజిక వ‌ర్గంకు చెందిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఏపీలో వీచిన వైఎస్సార్ పార్టీ ప్రభంజ‌నాన్ని త‌ట్టుకుని జ‌న‌సేన పార్టీ నుంచి గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో రాపాక వ‌ర ప్ర‌సాద రావు దొంగ ఓట్లు - రిగ్గింగ్‌ కు పాల్ప‌డ్డార‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు వైసీపీ నేత బొంతు రాజేశ్వ‌ర్‌ రావు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావుతోపాటు రిటర్నింగ్ అధికారికి నోటీసులు జారీ చేశారు.

రాపాక వరప్రసాద్ రావుపై వస్తున్న దొంగ ఓట్లు - రిగ్గింగ్ ఆరోపణలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రిటర్నింగ్ అధికారిని ఆదేశించింది హైకోర్టు. అలాగే జనసేన ఎమ్మెల్యేకు నోటీసులు పంపించారు. ఈ పిటిషన్ పై తదుపరి విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది. రాపాక వ‌రప్ర‌సాద్ జ‌న‌సేన పార్టీకి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. ఇప్పుడు హైకోర్టు నోటీసులు జారీ చేయ‌డంతో రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!