Begin typing your search above and press return to search.

ఏపీలో ఆరాచకం.. ట్రాక్టర్ తొక్కించి మరీ చంపేశాడు

By:  Tupaki Desk   |   4 Aug 2020 7:50 AM GMT
ఏపీలో ఆరాచకం.. ట్రాక్టర్ తొక్కించి మరీ చంపేశాడు
X
కొన్ని నేరాల గురించి విన్నంతనే బిహార్ లోనో.. ఉత్తరప్రదేశ్ లోనో జరిగినట్లుగా భావిస్తాం. దారుణం ఏమంటే.. ఆ తరహా నేరాలు ఈ మధ్యన రెండు తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఏపీలో చోటు చేసుకుంది. అప్పు తిరిగి చెల్లించని ఒక గిరిజన మహిళను ట్రాక్టర్ పెట్టి తొక్కించి చంపేశాడో దుర్మార్గుడు. విన్నంతనే మనసు చేదుగా అయిపోయే ఈ ఉదంతంలోకి వెళితే..

గుంటూరు జిల్లా శివాపురం తండాలో రమావత్ మంత్ర్యానాయక్.. మంత్రుభాయి దంపతులు అటవీ భూములు సాగు చేస్తుంటారు. తాము వ్యవసాయం చేసే భూమిపై హక్కులు సొంతం చేసుకున్నారు. తమకున్న రెండున్నర ఎకరాల భూమిలో పంటలు పండిస్తుండేవారు. సాగుతో పాటు కుటుంబ అవసరాల కోసం రెండేళ్ల క్రితం భూమిని తాకట్టు పెట్టి రూ.3.80లక్షలు అప్పు తీసుకున్నారు. వడ్డీతో సహా అప్పు మొత్తాన్ని చెల్లించాలని ఒత్తడి చేస్తున్నాడు. ఒకవేళ అప్పు తీర్చకుంటే భూమిని స్వాధీనం చేసుకుంటానని బెదిరించాడు.

దీంతో.. వీరిద్దరి మధ్య వివాదం సాగుతోంది. ఇదిలా ఉంటే.. తమ పొలానికి వెళ్లేప్రయత్నంచేస్తున్నారని తెలుసుకున్న శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో వెళ్లాడు. అప్పు చెల్లించకుండా పొలంలోకి వెళితే ఒప్పుకోనని బెదిరించాడు. సాగు చేసి అప్పు చెల్లిస్తానని వేడుకున్నా.. అతడు ఒప్పుకోలేదు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆవేశంలో విచక్షణ కోల్పోయిన శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో మంత్రుభాయిని తొక్కించుకుంటూ వెళ్లిపోయాడు. దీంతో.. ఆమె అక్కడికక్కడే మరణించింది. ట్రాక్టర్ తో నిందితుడు పరారయ్యాడు. ఈ ఉదంతం సంచలనంగా మారింది.