Begin typing your search above and press return to search.

గుడ్న్యూస్.. ఇక నుంచి సులభంగా ఇమ్మిగ్రేషన్

By:  Tupaki Desk   |   27 Jun 2022 11:30 PM GMT
గుడ్న్యూస్.. ఇక నుంచి సులభంగా ఇమ్మిగ్రేషన్
X
విదేశీ ప్రయాణం ఇక నుంచి సులభంగా మారబోతోందా అంటే అవుననే చెబుతోంది కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం. టెక్ దిగ్గజం టీసీఎస్ సాయంతో ఈ-పాస్పోర్ట్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఏడాది చివరి నాటికి విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ-పాస్పోర్ట్ అందుబాటులోకి వస్తోందని ప్రకటించింది.

ఇక నుంచి ఫారెన్ ప్రయాణాలు ఈజీ కానున్నాయి. ఎందుకంటే.. కేంద్ర సర్కార్ ఈ-పాస్పోర్ట్ విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది. చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్ ఈ ఏడాది చివరిలో ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ నిర్వహణలో పాస్‌ పోర్ట్‌ కార్యకలాపాలు కొనసాగుతాయి. 2008లో టీసీఎస్ భాగస్వామ్యంలో కేంద్రం ఆన్లైన్ పాస్పోర్ట్ సేవలను ప్రారంభించింది. ఇప్పుడు రెండోసారి ఆ సంస్థ భాగస్వామ్యం లోనే చిప్ ఆధారిత ఈ-పాస్పోర్ట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది.

భారత్కు చెందిన వ్యక్తి అమెరికాలో శాశ్వతంగా ఉండేందుకు.. లేదంటే పౌరసత్వం పొందేందుకు ఆ దేశ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దానికోసం జరిగే ప్రక్రియను ఇమ్మిగ్రేషన్ అంటారు. ఈ ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్ కోసం టీసీఎస్-కేంద్రం సంయుక్తంగా ఈ-పాస్పోర్ట్ విధానాన్ని తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నాయి.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ డిసెంబర్‌ నాటికే వినియోగదారులకు ఈ-పాస్‌పోర్ట్‌లను అందించాలని భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న పాస్‌పోర్ట్‌లను చిప్‌లతో ఆధునీకరించనున్నట్లు టీసీఎస్‌ పబ్లిక్‌ సెక్టార్‌ బిజినెస్‌ యూనిట్‌ విభాగం ప్రతినిధి తేజ్‌బట్లా వెల్లడించారు.

ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో జరిగే అవకతవకల్ని అరికట్టేందుకు ఇంట్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌(ఐడీఏఓ) సెక్యూర్‌ బయోమెట్రిక్‌ డేటాతో ఈ-పాస్‌ పోర్ట్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఒక్కో దేశానికి ఒక్కో డిజిటల్‌ సిగ్నేచర్‌తో ఉన్న ఈ చిప్‌లలో పాస్‌పోర్ట్‌ వినియోగదారుల బయోగ్రఫికల్‌ డేటాతో పాటు డిజిటల్‌ సెక్యూరిటీ ఫీచర్ల డేటా ఉంటుంది. ఆ డేటా సాయంతో ఇమ్మిగ్రేషన్‌లో తలెత్తే లోపాల్ని అరికట్టవచ్చు.

కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌తో సెమీకండక్టర్‌ చిప్‌ తయారీ తగ్గిపోయింది. అన్ని డివైజ్‌లలో ఉపయోగించే చిప్‌ కొరత ఆయా సంస్థల్ని తీవ్రంగా వేధిస్తోంది. కానీ ఈ-పాస్‌పోర్ట్‌ ప్రాజెక్ట్‌ కోసం కేంద్రం ముందుగానే కావాల్సిన చిప్‌లను సిద్ధంగా ఉంచుకుందని తేజ్‌ బట్లా తెలిపారు.
ఈ-పాస్‌పోర్ట్‌ వినియోగదారుల డేటాను భద్రపరిచేందుకు డేటా సెంటర్ల అవసరం ఎక్కువగా ఉంది.

అందుకే దేశ వ్యాప్తంగా రెండు ప్రాంతాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న డేటా సెంటర్ల ను ఆధునీకరించనున్నట్లు వెల్లడించారు. ఈ-పాస్‌పోర్ట్‌పై పనిచేస్తున్న టీసీఎస్‌ వినియోగదారులకు అందించే సేవల్ని మరింత సులభతరం చేయనుంది. చాట్‌ బోట్‌, బయోమెట్రిక్‌తో ఆటో రెస్పాన్స్‌ వంటి ఫీచర్లను ఈ ఈ-పాస్‌ పోర్ట్‌కు జత చేయనుంది.