Begin typing your search above and press return to search.

పరువు హత్య: కూతురిని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి

By:  Tupaki Desk   |   29 May 2023 10:00 PM GMT
పరువు హత్య: కూతురిని పెట్రోల్ పోసి కాల్చేసిన తండ్రి
X
వద్దన్నా ప్రియుడితో వెళ్లినందుకు కన్నకూతురును చంపేశాడు ఓ తండ్రి. తమ గౌరవ మర్యాదలు మంటగలిశాయని కన్న కూతురినే అంతమొందించాడు. బాధితురాలి సోదరులు కూడా ఇందుకు సహకరించారు. యువతిని తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ఇరుగూ పొరుగూ వారి సాయంతో ఆస్పత్రిలో కొన ఊపిరితో ఉన్న ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి మరణించింది.

పాకిస్తాన్‌ లో నేరాలు, ఘోరాలు ఎంత క్రూరంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. పాక్‌ రాజధాని లాహోర్‌ కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాంగ్‌ జిల్లాలోని గర్‌ హరాజ్‌ ఏరియాలో జరిగిన సంఘటన ఇది. ఈ ఊరిలో రజబ్‌ అలీ నివాసం ఉంటున్నారు. రజబ్‌ పెద్దకుమార్తె వయస్సు 20 సంవత్సరాలు. ఆమె అదే ఏరియాలో ఉండే ఓ యువకున్ని ప్రేమించింది. కొంతకాలంగా వీరిద్దరూ శికార్లు చేస్తున్నారు. విషయం ఈ నోటా ఆ నోటా తండ్రికి తెలిసింది. స్థానికం యువకుడిని కూతురు ప్రేమించడం జీర్ణించుకోలేకపోయాడు.

లవ్‌ మ్యాటర్‌ తెలిసిన తండ్రి ఆమెను హెచ్చరించారు. ఇక మీదట ఆ వ్యక్తిని కలవకూడదని వార్నింగ్‌ ఇచ్చారు. అయినా ప్రియుడిని మరిచిపోలేని ఆమె రహస్యంగా కలవడం మొదలుపెట్టింది. ఎప్పటిలాగే షికార్లకు వెళ్లింది. ఓ రోజు ఇంట్లో లేని సమయం చూసి అతనితో ఊరు వదిలి వెళ్లింది. దీంతో ఆమె ఇక మారదని భావించిన తండ్రి ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

కూతురు ఇంటికి రాగానే ఆమెను తీవ్ర చిత్రహింసలకు గురి చేశారు. ఆ తరువాత యువతిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఇందుకు యువతి సోదరులిద్దరి సహకారమూ తీసుకున్నాడు. తీవ్ర గాయాలై కొన ఊపిరితో ఉన్న ఆమెను స్థానికులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు ఆస్పత్రికి చేరుకుని వాంగ్మూలం సేకరించారు. ప్రేమించినందుకు తన తండ్రి, ఇద్దరు సోదరులు తనపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారని చెప్పింది. వాంగ్మూలం ఇచ్చిన కొద్దిసేపటికే ఆమె కన్నుమూసింది. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.