Begin typing your search above and press return to search.

యువకుడిపై నలుగురు గ్యాంగ్ రేప్..ఎలా జరిగిందంటే!

By:  Tupaki Desk   |   12 Dec 2019 11:34 AM GMT
యువకుడిపై నలుగురు గ్యాంగ్ రేప్..ఎలా జరిగిందంటే!
X
యువకుడి పై నలుగురు కామాంధులు అఘాయిత్యం ....ఇదేంటి పొరపాటు పడ్డారు ..యువతీని మానభంగం చేసిన నలుగురు కామాంధులు కదా అని అనుకుంటున్నారా? మీ తప్పేమీ లేదు. ప్రస్తుతం సమాజం ఆలా తయారైంది. ఈ సమాజంలో ఆడవారికే కాదు మగవారికి కూడా రక్షణ లేదు చెప్పడానికే ఇదే ప్రత్యేక నిదర్శనం. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో వికృత ఘటన జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ... ముంబై సెంట్రల్ సబర్బన్‌ లో నివసించే ఓ యువకుడు.. ఆదివారం ఓ రెస్టారెంట్ వద్ద సెల్ఫీ దిగి ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశాడు.

అతడి ఫాలోవర్స్‌ లో ఉన్న నలుగురు వ్యక్తులు దాన్ని చూసి చూసి అడ్రస్ ట్రేస్ చేసి అతడిని కలుసుకున్నారు. మొదట ఇన్‌ స్టాగ్రామ్‌ లో మిమ్మల్ని చాలారోజులుగా ఫాలో అవుతున్నామని - మీకు అభిమానులమని చెబుతూ ఆ యువకుడిని బాగా నమ్మించారు. అలాగే మీతో కాసేపు గడపాలని ఉందని వారు కోరడంతో అతడు ఒకే అన్నాడు. ఆ తరువాత అందరూ రెస్టారెంట్ సమీపంలోనే అటు ఇటు తిరిగారు. తర్వాత ఆ యువకుడిని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు.

కదులుతున్న కారులోనే యువకుడిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం తెల్లవారుజామున అతడిని ఓ నిర్మానుష్య ప్రాంతంలో వదిలేసి వెళ్లిపోయారు. కొద్దిసేపటికి తేరుకున్న బాధితుడు నేరుగా ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో వారు వెంటనే వీబీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు మైనర్ కావడంతో అతడిని జువైనల్ హోమ్‌ తరలించారు. మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలపై ఓ వైపు ఆందోళన కొనసాగుతుండగానే.. ఇప్పుడు యువకుడిపై జరిగిన ఈ దారుణం ముంబయిలో సంచలనంగా మారింది.