Begin typing your search above and press return to search.

ప్రియుడిపై మోజు..భర్తకి భోజనంలో విషం పెట్టి, ట్విస్ట్ ఏంటంటే

By:  Tupaki Desk   |   11 Sep 2021 7:46 AM GMT
ప్రియుడిపై మోజు..భర్తకి భోజనంలో విషం పెట్టి, ట్విస్ట్ ఏంటంటే
X
వివాహేతర సంబంధాలు ఎన్నో కుటుంబాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ఆ విషయం తెలిసినా కూడా కొందరు ఆ తప్పులనే మళ్లీ మళ్లీ చేస్తుంటారు. తాజాగా ఓ వివాహిత భర్తని కాదని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోగా.. చివరకు అది వారి కుటుంబాన్నే నాశనం చేసింది. తన ప్రియుడి విషయం తెలిసిందని , తన జల్సాలకి అడ్డు పడుతున్నాడని కట్టుకున్న భర్తను విషం పెట్టి చంపేసింది. ఆ తర్వాత అందరిని నమ్మించినా పోలీసుల విచారణ లో అసలు నిజం ఏమిటో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై లో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే .. తమిళనాడులోని చెన్నై సిటీలోని చూలైమేడులోని కన్నగ వీధిలో ఓ 42 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం మహిళతో అతనికి వివాహం జరిగింది. భర్త తో సంతోషంగా కాపురం చేసిన అతని భార్య ఇద్దరు కుమార్తెలకు తల్లి అయ్యింది. భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి చాలా కాలం సంతోషంగానే జీవనం సాగింది. చెన్నై మెట్రలో సంస్థలో అతని భార్య ఉద్యోగం చేస్తోంది. మెట్రో రైలులో ఉద్యోగం చేస్తున్న భార్య ఉదయం ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం ఇంటికి వస్తోంది. మెట్రోలో పని చేస్తున్న ఆమెకి కన్యాకుమారికి జిల్లాకు చెందిన మరో వ్యక్తి పరిచయం కావడంతో ఆమె అతనితో చనువు పెంచుకుంది.

ప్రియుడు మోహన్ మోజులో పడిపోయిన ఆమె పగలు టైమ్ చిక్కినప్పుడు అతనితో తిరుగుతూ ఎంజాయ్ చేసింది. రానురాను భర్త చేదుకావడం, ప్రియుడు స్వీట్ గా ఉండటంతో అతనితో అక్రమ సంబంధం పెట్టుకునింది. భర్త కు టోపీ పెడుతూ వచ్చిన భార్య తనకు పని ఒత్తిడి ఎక్కువ అయ్యింది అంటూ రాత్రి లేటుగా ఇంటికి రావడం మొదలు పెట్టింది. నిజంగానే భార్య పని ఒత్తిడితో ఉందని ఆమె భర్త కొంతకాలం చూసిచూడట్లు ఉన్నాడు. రానురాను భర్త ను మోసం, భార్య ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ప్రపంచాన్ని మరిచిపోయింది. ప్రియుడు మోజులో పడిపోయిన ఆమె భర్త, కూతుర్లను పూర్తిగా నిర్లక్షం చేస్తూ వచ్చింది.

కొంతకాలానికి భార్య అక్రమ సంబంధం గురించి ఆమె భర్తకు తెలిసిపోయింది. అసలే మద్యం సేవించడం అలవాటు ఉన్న ఆ వ్యక్తి భార్య ను నిలదీశాడు. తాను ఎవ్వరితో అక్రమ సంబంధం పెట్టుకోలేదని, నువ్వు తప్పా తనకు ఏ మగవాసన తెలీదని అతని భార్య చందమామ కథలు చెప్పింది. భార్య తీరుతో రగిలిపోయిన భర్త ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. తన భర్త బతికుంటే తన జల్సాలకు అడ్డు వస్తాడని భయపడిన భార్య ఆమె మొగుడిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. తన భర్త ను చంపేసి జీవితాంతం నీతోనే ఉంటానని అతని ప్రియుడు మోహన్ కు చెప్పింది.

ఆమె భర్త ను హత్య చెయ్యడానికి ఓకే చెప్పిన ప్రియుడు అతని ప్రియురాలు కి విషం బాటిల్ తెచ్చి ఇచ్చాడు. ఈనెల 2వ తేదీ స్పైసీగా మంచి నాటుకోడి పులుసు, కుష్కా చేసిన భార్య అందులో విషం కలిపి ఆమె భర్త కు పెట్టింది. విషం కలిపిన చికెన్ తిని ఆ వ్యక్తి ఆసుపత్రిపాలైనాడు. నాలుగు రోజులు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాటం చేసి ఈనెల 6వ తేదీన కన్నుమూశాడు. తన భర్త కు విపరీతంగా మద్యం సేవించే అలవాటు ఉందని, రెండవ తేదీన పీకలదాక మద్యం సేవించి ఇంటికి వచ్చి భోజనం చేశాడని, తరువాత అతను ఊపిరిఆడక కిందపడిపోతే ఆసుపత్రికి తరలించారని, తరువాత చికిత్స విఫమలై మరణించాడని పోలీసులు, కుటుంబ సభ్యులను నమ్మించింది.

ఆ తర్వాత అతని శవానికి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆహారంలో విషం కలపడం వలనే సెల్వం ప్రాణాలు పోయాయని పోస్టుమార్టం నివేదికలో వెలుగు చూసింది. భర్త ను చంపేసి, ఆమె ప్రియుడు తో రోజు గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడుతూ కులుకుతోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.చనిపోయిన వ్యక్తి భార్య సీక్రేట్ ప్రియుడు మీద ఇప్పటికే 7 హత్య కేసులు, నాలుగు హత్యాయత్నం కేసులతో పాటు అనేక క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని పోలీసులు అంటున్నారు. చెన్నై, కన్యాకుమారి, తిరునల్వేలి, టుటికోరిన్ తో పాటు అనేక జిల్లాల్లో అతని మీద కేసులు ఇంకా విచారణ పెండిగ్ లో ఉన్నాయని పోలీసులు అంటున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు చెన్నైలో కలకలం సృష్టుస్తుంది.