Begin typing your search above and press return to search.

వైఎస్ వివేకా హత్య కేసులో అదిరిపోయే ట్విస్టులు

By:  Tupaki Desk   |   24 July 2021 10:30 AM GMT
వైఎస్ వివేకా హత్య కేసులో అదిరిపోయే ట్విస్టులు
X
ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ట్విస్టులు మీద ట్విస్టులు ఈ కేసులో వస్తున్నాయి. సీబీఐ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తోంది.

వైఎస్ వివేకా హత్య కేసులో ఆయన ఇంటి వాచ్ మెన్ రంగన్న కీలకంగా మారాడు. పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి వద్ద భడవాండ్ల రంగన్న అలియాస్ రంగయ్య (65) కాపలాదారుడిగా ఉంటున్నాడు.వైఎస్ వివేకా హత్య జరిగిన 2019 మార్చి 15న ఆయనే ఆ ఇంటి కాపలదారుగా ఉన్నాడు.

వైఎస్ వివేకాను చివరి సారిగా చూసింది రంగన్ననే. హత్యకు గురైన మార్చి 15న ఉదయం వివేకా నిద్రలేచి బయటకు రాకపోయేసరికి పక్కడోరులోంచి బయటకు వెళ్లి చూడగా బాత్ రూంలో రక్తపుమడుగులో ఉన్నట్లు గుర్తించారు. అందరికీ చెప్పింది రంగన్ననే. అందుకే ఈ హత్యలో రంగన్న కీలక సాక్షిగా ఉన్నాడు.

శుక్రవారం వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగయ్య ఇచ్చిన సమాచారంతో కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

వైఎస్ వివేకా హత్య కోసం ఇద్దరు వ్యక్తులు రూ.8 కోట్లు సుపారీ ఇచ్చినట్లుగా రంగయ్య జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు ఈ వాంగ్మూలం కీలకంగా మారబోతోందని తెలుస్తోంది.

సుపారీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతోపాటు మరో ఐదుగురు వ్యక్తులకు ఈ హత్యతో సంబంధం ఉందని రంగయ్య చెప్పినట్టుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆ ఐదుగురు బయట ప్రాంతానికి చెందిన వారని.. ఇద్దరు సుపారీ ఇచ్చారని.. మరో వ్యక్తి, మొత్తం 8మంది ఈ హత్యలో పాల్గొన్నట్లు రంగయ్య వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు కీలక వ్యక్తుల పేర్లనుచెప్పినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వాంగ్మూలంతో సీబీఐ అధికారులు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది.

ఇక వైఎస్ వివేకా హత్యలో పాత్రధారిగా ఎర్ర గంగారెడ్డి పేరును వాచ్ మెన్ రంగన్న చెప్పినట్టుగా మీడియాలో ప్రచారం అవుతోంది. వివేకా హత్య జరిగిన రోజు అక్కడే ఉన్న ఎర్ర గంగిరెడ్డి ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు రంగన్న వాంగ్మూలంలో చెప్పారని వార్తలువచ్చాయి. ఈ ఆరోపణలపై తాజాగా ఎర్ర గంగారెడ్డి స్పందించారు. ఈ ఆరోపణలను ఖండించారు.

'రంగన్న ఎవరో తెలియదని.. తాను ఎందుకు బెదిరిస్తానని గంగారెడ్డి' పేర్కొన్నారు. రంగన్నతో తనకు పెద్దగా పరిచయం లేదన్నారు. రంగన్న నిన్న మద్యం మత్తులో మాట్లాడారని ఎర్ర గంగిరెడ్డి ఆరోపించారు. వివేకాను ఎదురించే ధైర్యమే తనకు లేదని.. అలాంటి ఆయన హత్య కేసులో తన ప్రమేయం ఉందని రంగన్న చెప్పడం దారుణమని గంగిరెడ్డి పేర్కొన్నారు.

వివేకా బావమరిది ఫోన్ చేసి మీ సారు చనిపోయారని తనకు చెప్పారని గంగిరెడ్డి తెలిపారు. వివేకా కూతురు నుంచి వివరాలు తెలిసాయని.. హత్యతో అసలు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన సన్నిహితుడు గంగిరెడ్డి తెలిపారు. బెంగళూరు స్థల వివాదం వివేకా చనిపోయాక రెండు నెలల ముందే పరిష్కారమైందని గంగిరెడ్డి తెలిపారు.

వివేకా అనుచరుడు అయిన నేతు ఆ హత్య జరిగిన రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చానని గంగిరెడ్డి తెలిపారు. ఉదయం లేటుగా నిద్ర లేచానని వెల్లడించారు. వివేకా బావమరిది ఫోన్ చేస్తేనే ఆయన చనిపోయిన విషయం తెలిసిందన్నారు.