Begin typing your search above and press return to search.

పేటీఎం, మేక్‌మైట్రిప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్‌ బుకింగ్

By:  Tupaki Desk   |   17 Jun 2021 2:30 AM GMT
పేటీఎం, మేక్‌మైట్రిప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్‌ బుకింగ్
X
కేంద్రప్రభుత్వం దేశంలోని ప్రజలకు వ్యాక్సిన్ బుక్ చేసుకుందుకు ఒక కేంద్రప్రభుత్వానికి చెందిన ఒక యాప్ తోపాటు వెబ్ సైట్ ను అందుబాటులో ఉంచింది. కోవిన్ వెబ్ సైట్ తో పాటు ఆరోగ్య సేతు యాప్ లో కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.కానీ అది దేశవ్యాప్తంగా సర్వర్ బిజీ అయిపోయి చాలా మంది వీటితో అలసిపోయేలా పరిస్థితి మారింది..

ఇక వ్యాక్సిన్ల తక్కువ లభ్యతతో, స్లాట్లు నిమిషాల్లోనే బుక్ అవుతున్నాయి.. ఇంకా చాలా మందికి టీకా స్లాట్ బుక్ చేసుకోవడం చాలా కష్టమనిపిస్తోంది. ప్రారంభ రోజుల్లో భారీగా ప్రజలు బుక్ చేసుకునేందుకు ఎగబడగా కోవిన్ వెబ్‌సైట్ , యాప్ క్రాష్ అయ్యాయి. కోవిన్ , ఆరోగ్య సేతు యాప్‌లపై ఒత్తిడిని తగ్గించడానికి, పేటీఎం, మేక్‌మైట్రిప్ ద్వారా టీకా వేయడానికి భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

కొన్ని వారాల క్రితం కేంద్రం థర్డ్ పార్టీ దరఖాస్తులతో కోవిన్‌ వెబ్ సైట్ ను ఏకీకృతం చేయడానికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. తదనుగుణంగా 145 సంస్థలు టీకాలు వేయడానికి యూనియన్ హెల్త్ అథారిటీతో దరఖాస్తు చేసుకున్నాయి. సుమారు 91 మంది దరఖాస్తుదారులు ఆమోదించబడ్డారు. వారిలో 81 ప్రైవేట్ మరియు 10 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి.

అపోలో హాస్పిటల్స్, ఐసిఐసిఐ లోంబార్డ్, మాక్స్ హెల్త్‌కేర్, డాక్టర్ రెడ్డిస్, ఇన్ఫోసిస్, శివం ఇ-కామర్స్, సినర్జిక్ లాంటి ఆరోగ్య సంస్థలు ఆమోదాలు పొందిన వాటిల్లో ఉన్నాయి. వినియోగదారులు వ్యాక్సిన్ల కోసం తమ యాప్ లో స్లాట్‌ను సులువుగా బుక్ చేసుకోవచ్చని పేటీఎం సోమవారం ప్రకటించింది. "పేటిఎమ్ వినియోగదారులు ఇప్పుడు పేవాట్ యాప్ ద్వారా సమీప కేంద్రంలో కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ రెండింటి కోసం వారి టీకా స్లాట్లను శోధించవచ్చు, కనుగొనవచ్చు. బుక్ చేసుకోవచ్చు" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

భారతదేశంలో ఇప్పటివరకు 26,19,72,014 మందికి వ్యాక్సిన్లను వేసింది. గత 24 గంటల్లో 28,00,458 మంది టీకాలు తీసుకున్నారు. భారతదేశం రోజువారీ పాజిటివిటీ రేటు 3.22 శాతంగా ఉంది. రికవరీ రేటు 95.80 శాతానికి పెరిగింది.