Begin typing your search above and press return to search.
ప్రతిపక్ష నేత ఇంటి జప్తు కు ఎందుకంత తొందర?: సీఐడీ కి కోర్టు ప్రశ్న
By: Tupaki Desk | 6 Jun 2023 8:31 PMఉమ్మడి గుంటూరు జిల్లా లోని ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ ఇంట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ఇంటిని జప్తు చేయడానికి సీఐడీ కి రాష్ట్ర హోం శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో లింగమనేని రమేష్ దీని పై కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యం లో తాజాగా జరిగిన విచారణకు సంబంధించి సీఐడీ అధికారుల ను ఏసీబీ కోర్టు సూటి గా ప్రశ్నించింది. ప్రతిపక్ష నేత ఇంటి జప్తున కు ఎందుకంత తొందర అని నిలదీసింది.
సదరు ఇంటిని జప్తు చేసేందు కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్మెంట్ కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని జప్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించాల్సిన అవసరముందని చెప్పింది. మే 18న నోటీ సు జారీ చేసినందున లింగమనేని రమేష్ కు కేసు ఫైళ్లను ఇవ్వాలని సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.
అటాచ్మెంట్ వ్యవహారం లో విచారణ జరి పే అధికారం ఏసీబీ కోర్టుకు ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ పిటిషన్పై జూన్ 2న వాదనలు విన్న కోర్టు.. తెలిపింది. కాగా, మే 17న తమకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసిందని.. అయితే ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని లింగమనేని తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు లో తమ వాదనలు వినాలని కోర్టును కోరారు.
క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 కి వ్యాలిడిటీ ఉందో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందన్నారు. గతం లోనే ఈ కేసులో హైకోర్టు నుంచి లింగమనేని రమేష్ ముందస్తు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు సీఐడీ తరపున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అనుమతించడం లేదా తిరస్కరించడం పై ఏదో ఒక విధమైన నిర్ణయం వెల్లడించాకే ప్రతివాదులకు నోటీ సు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నమవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోర్టు.. "అసలు ప్రతిపక్ష నేత నివాసం ఉంటున్న ఇంటిని జప్తు చేసుకోవడంలో ఎందుకంతగా తొందర పడుతున్నారు?" అని ప్రశ్నించింది.
సదరు ఇంటిని జప్తు చేసేందు కు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. అటాచ్మెంట్ కు అనుమతించాలంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని జప్తు కోసం అభ్యర్థించిన అధికారిని తాము విచారించాల్సిన అవసరముందని చెప్పింది. మే 18న నోటీ సు జారీ చేసినందున లింగమనేని రమేష్ కు కేసు ఫైళ్లను ఇవ్వాలని సీఐడీని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది.
అటాచ్మెంట్ వ్యవహారం లో విచారణ జరి పే అధికారం ఏసీబీ కోర్టుకు ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు. ఈ పిటిషన్పై జూన్ 2న వాదనలు విన్న కోర్టు.. తెలిపింది. కాగా, మే 17న తమకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసిందని.. అయితే ఇప్పటి వరకు ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వలేదని లింగమనేని తరపు న్యాయవాది అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఈ కేసు లో తమ వాదనలు వినాలని కోర్టును కోరారు.
క్రిమినల్ లా సవరణ ఆర్డినెన్స్-1944 కి వ్యాలిడిటీ ఉందో లేదో నిరూపించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉందన్నారు. గతం లోనే ఈ కేసులో హైకోర్టు నుంచి లింగమనేని రమేష్ ముందస్తు బెయిల్ పొందారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మరోవైపు సీఐడీ తరపున ప్రత్యేక పీపీ వివేకానంద వాదనలు వినిపించారు. అనుమతించడం లేదా తిరస్కరించడం పై ఏదో ఒక విధమైన నిర్ణయం వెల్లడించాకే ప్రతివాదులకు నోటీ సు ఇచ్చే ప్రశ్న ఉత్పన్నమవుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కోర్టు.. "అసలు ప్రతిపక్ష నేత నివాసం ఉంటున్న ఇంటిని జప్తు చేసుకోవడంలో ఎందుకంతగా తొందర పడుతున్నారు?" అని ప్రశ్నించింది.