Begin typing your search above and press return to search.

అఖిల ప్రియ ఇష్యూలో చంద్రబాబు చేతులెత్తేశారా?

By:  Tupaki Desk   |   13 Jan 2021 2:30 AM GMT
అఖిల ప్రియ ఇష్యూలో చంద్రబాబు చేతులెత్తేశారా?
X
బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. హఫీజ్ పేటలోని 50 ఎకరాల స్థలం వివాదానికి సంబంధించి ఈ కిడ్నాప్ వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో, ఈ కిడ్నాప్ కేసులో ఏ1గా భూమా అఖిల ప్రియ, ఏ2గా టీడీపీ నేత ఏబీ సుబ్బారెడ్డి, ఏ3గా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ ను పోలీసులు చేర్చారు. భార్గవ్‌రావ్ కోసం పోలీసులు బెంగుళూరులో గాలిస్తున్నారు. కిడ్నాప్ అయిన వ్యక్తులు కేసీఆర్ బంధువులు కావడం, అఖిల ప్రియకు వ్యతిరేకంగా బలమైన సాక్షాలుండడంతో ఆమె చుట్టు ఉచ్చు బిగుస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, తాజా కిడ్నాప్ కేసు వ్యవహారం నేపథ్యంలో అఖిల ప్రియ బినామీ ఆస్తులపై ఏపీ పోలీసులు ఫోకస్ పెట్టారట. దీంతో, ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు అఖిల ప్రియను రౌండప్ చేసిన నేపథ్యంలో ఈ వ్యవహారంలో అఖిల ప్రియ ....టీడీపీ అధినేత చంద్రబాబు సాయం కోరారట.

తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా అఖిల ప్రియ కోరగా...అందుకు చంద్రబాబు నిరాకరించారని తెలుస్తోంది. ఈ విషయంలో తానెటువంటి సాయం చేయలేనని చంద్రబాబు చెప్పారట. ఇది పూర్తిగా ఆమె వ్యక్తిగత వ్యవహారమని, దీంతో, పార్టీకి సంబంధం లేదని చంద్రబాబు భావిస్తున్నారట. అందులోనూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ఇన్వాల్వ్ అయితే టీడీపీకి చెడ్డపేరు వస్తుందన్న భావనలో బాబు ఉన్నారట. అఖిల ప్రియ వ్యవహారంలో స్పందించవద్దని టీడీపీ నేతలకు బాబు చెప్పారని తెలుస్తోంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియకు మాట సాయం చేసినా కూడా...పార్టీకి డ్యామేజి తప్పదన్న భావనలో చంద్రబాబు ఉన్నారని తెలుస్తోంది. దీంతో, చంద్రబాబుతో మాట్లాడే ప్రయత్నం చేసిన అఖిల ప్రియకు చంద్రబాబు అందుబాటులో లేరని తెలుస్తోంది. ఏది ఏమైనా అఖిల ప్రియ ఇష్యూలో చంద్రబాబు చేతులెత్తేశారన్న ప్రచారం జరుగుతోంది.