Begin typing your search above and press return to search.

ఇక ఇంటి నుంచే ఓటేయవచ్చు

By:  Tupaki Desk   |   29 March 2023 5:23 PM GMT
ఇక ఇంటి నుంచే ఓటేయవచ్చు
X
దేశంలో తొలిసారి 'ఓటు ఫర్ హోమ్' అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోగాత్మకాన్ని దీన్ని అమల చేస్తోంది. కర్ణాటకలోని 80 ఏళ్లు వయసు పైబడిన 12.15 లక్షల మంది ఓటర్లు ఇక నుంచి ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవచ్చని సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. కర్ణాటకలో ఈ ప్రక్రియ విజయవంతమైతే దీన్ని అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తామని తెలిపారు.

రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులు (పిడబ్ల్యుడి), 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు ఇంటి నుంచే ఓటు వేయవచ్చని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు 12.15 లక్షలు, దివ్యాంగుల ఓటర్లు 5.55 లక్షల మంది ఉన్నారు.

కర్ణాటకలో తొలిసారిగా 9.17 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 17 ఏళ్లు పైబడిన 1.25 లక్షల మంది అడ్వాన్స్ అప్లికేషన్ ఫెసిలిటీ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని సీఈసీ తెలిపింది.

మొత్తం 41,000 మంది దరఖాస్తుదారులు ఏప్రిల్ 1 నాటికి 18 ఏళ్లు నిండుతారు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులు.

ఎన్నికల కమిషన్ కర్ణాటక రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలలో 58,282 పోలింగ్ స్టేషన్‌లను కూడా ఏర్పాటు చేస్తుంది. ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు సగటు ఓటర్ల సంఖ్య 883గా ఉంది. సగం పోలింగ్ స్టేషన్‌లు వెబ్ కాస్టింగ్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. 1320 పోలింగ్ స్టేషన్‌లను మహిళలు నిర్వహిస్తారు. మెరుగైన ఓటరు అనుభవం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు.

మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెల్లడి కానున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాలకు ఒకే సారి ఎన్నికలు జరగనుండగా, ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ ( సెక్యులర్) పార్టీల మధ్యన ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.