Begin typing your search above and press return to search.

కల్వకుంట్ల కవితపై సీబీఐ విచారణ సస్పెన్స్

By:  Tupaki Desk   |   6 Dec 2022 5:33 AM GMT
కల్వకుంట్ల కవితపై సీబీఐ విచారణ సస్పెన్స్
X
తెలంగాణ రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి. ఢిల్లీ లిక్కర్ స్కాం రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈ కేసులో భాగంగా ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించనున్న నేపథ్యంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తాజాగా ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నేడు మంగళవారం కవితను విచారిస్తామని గతంలో సీబీఐ నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద నోటీసులు పంపించారు సీబీఐ అధికారులు. ఈక్రమంలోనే తాను మంగళవారం అందుబాటులో ఉండడం లేదని విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాశారు కవిత.

మరోవైపు విచారణ నిమిత్తం సీబీఐ అధికారులు కోఠిలోని ఆఫీసుకు ఇప్పటికే చేరుకున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోకి సీబీఐకి అనుమతి లేదని ఇప్పటికే జీవో 56 విడుదల చేసింది. ఈ తరుణంలో కవితను విచారించాలంటే సీబీఐ అధికారులు తప్పనిసరిగా కోర్టు అనుమతి తీసుకోవాలని న్యాయనిపుణులు చెబుతున్నారు.

దీంతో కవిత విచారణ విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీబీఐకి ఇప్పటికే లేఖ రాసిన కవిత.. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. సీబీఐ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఎమ్మెల్సీ కవిత ఈ మేరకు ఏం జరుగుతుందో ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం ఉదయం కవిత ఇంటి వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొంది. కవిత జగిత్యాల పర్యటన నేపథ్యంలో ఉదయం 11 వరకూ సీబీఐ రాక కోసం కవిత వేచి చూస్తున్నట్టు సమాచారం.

ఢిల్లీ మద్యం కేసులో రేపు 6వ తేదీన తమ ముందు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన సీబీఐకి కల్వకుంట్ల కవిత ట్విస్ట్ ఇచ్చింది. మంగళవారం విచారణకు హాజరు కాలేనని సీబీఐకి లేఖ రాసింది. ఈ మేరకు ఆ లేఖ విడుదల చేసింది. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేనని లేఖలో కవిత పేర్కొన్నారు. ఈనెల 11, 12, 14,15 తేదీలలో అందుబాటులో ఉంటానని తెలిపారు.సీబీఐ నుంచి నోటీసు అందగానే హైదరాబాద్ లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఇటీవల కవతి ప్రకటించారు.

సీబీఐకి కవిత లేఖ రాశారు. ఎఫ్ఐఆర్ తోపాటు ఫిర్యాదు కాపీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత అనుబంధ కాపీలను ఇవ్వాలన్నారు.శనివారం ఉదయం ప్రగతి భవన్ కు వెళ్లి తన తండ్రి, సీఎం కేసీఆర్ తో తనకు వచ్చిన నోటీసులపై చర్చించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయనిపుణులతోనూ కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశంలోనూ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ డీటైల్స్ కాపీలు తీసుకోవాలని లేఖ రాయాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు కవిత లేఖ రాశారు. సమాచారాన్ని మీడియాకు ఇచ్చారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితకు ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. సీబీఐ నోటీసులు జారీ చేసింది. సీబీఐకి కేంద్ర హోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు కాపీతోపాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కవితను సీబీఐ విచారిస్తుందా? లేదా? అన్న ఉత్కంఠ నెలకొంది. కవిత చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు సీబీఐ ఏం నిర్ణయిస్తుంది? ఎలాంటి స్టెప్ వేస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.