Begin typing your search above and press return to search.

అమరావతిపై అసలు నిజం చెప్పిన బొత్స

By:  Tupaki Desk   |   10 Dec 2019 8:47 AM GMT
అమరావతిపై అసలు నిజం చెప్పిన బొత్స
X
కొద్దిరోజులుగా చంద్రబాబు పునాదిరాయి వేసిన ఏపీ రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట సంచలనమయ్యాయి. అమరావతిని బాబు దోచుకున్నాడని ఒకసారి.. వైసీపీ ప్రభుత్వం దోనకొండను ప్రత్యామ్మాయంగా చేస్తుందని మరోసారి.. ఇక అమరావతిలో అక్రమాలు నిగ్గుతేలుస్తామని మరోసారి బొత్స చేసిన వ్యాఖ్యలు సంచలనమైన సంగతి తెలిసిందే..

అయితే తాజాగా ఏపీ అసెంబ్లీలో రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ఉందని తెలిపారు. రాజధానిపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలను టీడీపీ మీడియా వక్రీకరించారని బొత్స వాపోయారు. ఇప్పటికీ రాజధానిలో చంద్రబాబు ఎలాంటి అభివృద్ధి చేయలేదని స్పష్టం చేశారు.

ఇక ఆ తర్వాత మాట్లాడిన రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సైతం తిరుమల బస్సులన్నీ నాణ్యత ప్రమాణాల మేరకే ఉన్నాయని.. చిత్తూరు జిల్లాలో 1278 బస్సులు ఫిట్ నెస్ గా ఉన్నాయని స్పష్టం చేశారు.