Begin typing your search above and press return to search.
ధోనీ దందాకు బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. భారీగా ఆర్డర్లు రద్దు..!
By: Tupaki Desk | 14 Jan 2021 5:37 AM GMTటీం ఇండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని.. కడక్నాథ్ కోళ్లు, హైదరాబాద్ గ్రామప్రియ కోళ్ల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ధోనీ వ్యాపారంపై బర్డ్ఫ్లూ తీవ్ర ప్రభావం చూపించింది. ఇటీవలే క్రికెట్కు గుడ్బై చెప్పిన మహీ.. రాంచీలోని తన 43 ఎకరాల ఫామ్హౌస్లో ఆర్గానిగ్ పౌల్ట్రీఫామ్ నెలకొల్పారు. అయితే ఇందుకోసం కడక్నాథ్ నల్లకోళ్ళను మధ్యప్రదేశ్లోని ఝబువా ప్రాంతం నుంచి గ్రామప్రియ కోళ్లను హైదరాబాద్ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకుంటారు.
ఇటీవల రెండువేల కోళ్లను ఆర్డర్ చేయగా.. వాటికి బర్డ్ఫ్లూ సోకింది. దీంతో వెంటనే ఆర్డర్ చేసినట్టు ధోనీ ఫామ్ హౌస్ నిర్వాహకులు తెలిపారు. ధోని ఆర్డర్ చేసిన కోళ్లు బర్డ్ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్ విశ్వరాజన్ ధ్రువీకరించారు. ధోనీ ఫామ్లో పెంచుతున్న ఈ కోళ్లకు ఎంతో డిమాండ్ ఉంది.. కడక్నాథ్ చికెన్ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు, గ్రామప్రియ చికెన్ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో ఇప్పటికే మనదేశంలో కోళ్ల పరిశ్రమ కుదేలయ్యింది.
తెలుగురాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ధరలు భారీగా తగ్గించినా చికెన్ను ప్రజలు కొనుగోలు చేయడం లేదు. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం మిగతా రాష్ట్రాలకు కూడా బర్డ్ఫ్లూ నిదానంగా పాకుతోంది. చికెన్ను బాగా ఉడికించుకొని తింటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కాస్త తక్కువగానే ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయినప్పటికీ ప్రజల్లో భయం పోవడం లేదు.
ఇటీవల రెండువేల కోళ్లను ఆర్డర్ చేయగా.. వాటికి బర్డ్ఫ్లూ సోకింది. దీంతో వెంటనే ఆర్డర్ చేసినట్టు ధోనీ ఫామ్ హౌస్ నిర్వాహకులు తెలిపారు. ధోని ఆర్డర్ చేసిన కోళ్లు బర్డ్ఫ్లూ బారిన పడ్డాయని కోళ్ల పంపకందారుడు డాక్టర్ విశ్వరాజన్ ధ్రువీకరించారు. ధోనీ ఫామ్లో పెంచుతున్న ఈ కోళ్లకు ఎంతో డిమాండ్ ఉంది.. కడక్నాథ్ చికెన్ ధర కేజీకి రూ. 900 నుంచి రూ. 1,200 వరకు, గ్రామప్రియ చికెన్ కూడా ఇంచుమించు అంతే ధర పలుకుతుంది. బర్డ్ఫ్లూ ఎఫెక్ట్తో ఇప్పటికే మనదేశంలో కోళ్ల పరిశ్రమ కుదేలయ్యింది.
తెలుగురాష్ట్రాల్లో చికెన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. ధరలు భారీగా తగ్గించినా చికెన్ను ప్రజలు కొనుగోలు చేయడం లేదు. మధ్యప్రదేశ్, కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం బర్డ్ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే ప్రస్తుతం మిగతా రాష్ట్రాలకు కూడా బర్డ్ఫ్లూ నిదానంగా పాకుతోంది. చికెన్ను బాగా ఉడికించుకొని తింటే బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ కాస్త తక్కువగానే ఉంటుందని వైద్యులు అంటున్నారు. అయినప్పటికీ ప్రజల్లో భయం పోవడం లేదు.