Begin typing your search above and press return to search.

కర్నూలు జిల్లా లో భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య

By:  Tupaki Desk   |   29 May 2023 2:00 PM GMT
కర్నూలు జిల్లా లో భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు చేసిన భార్య
X
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే గుండె మెలిపెట్టినంత బాధ కలగటం ఖాయం. అయ్యో అనిపించే ఈ ఉదంతం చూస్తే.. మనసున్న మనుషులు మర యంత్రాల మాదిరి.. మనీ మెషిన్ల మాదిరి మారిపోతున్న వైనానికి ప్రతీకగా ఈ ఉదంతం నిలుస్తుంది.

పత్తికొండ పట్టణానికి చెందిన 60 ఏళ్ల హరిక్రిష్ణ ప్రసాద్.. లలిత భార్యభర్తలు. అన్యోన్య దాంపత్యంగా ఉండే వీరు మెడికల్ షాపును నిర్వహిస్తుంటారు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు దినేశ్ కర్నూలులో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తుంటే..చిన్న కొడుకు కెనడాలో స్థిరపడ్డాడు. భర్త అనారోగ్యంతో కన్నుమూశారు.

ఇద్దరు కొడుకులు ఉన్నా.. తల్లిదండ్రుల్ని సరిగా చూసుకుంటున్నది లేదు.

తండ్రి చనిపోయిన సమాచారంతో ఇద్దరు కొడుకులు ఆస్తి కోసం గొడవలు చేస్తారన్న భయంతో.. ఇంట్లోనే భర్త భౌతికకాయానికి అట్టెపెట్టెలతో దహన సంస్కారాల్ని చేపట్టింది భార్య లలిత. ఇంట్లో నుంచి మంటలురావటంతో చుట్టుపక్కల వారు అలెర్టు అయి పోలీసులకు సమాచారం ఇవ్వటంతో అసలు విషయం బయటకు వచ్చింది.

తండ్రి చనిపోయిన సమాచారంతో వారిద్దరు ఆస్తి కోసం వస్తున్న విషయాన్ని తెలుసుకున్న లలిత.. భర్త అంత్యక్రియల్ని నిర్వహించిన తీరు పట్టణంలో షాకింగ్ గా మారింది. పెద్ద వయస్కులైన తల్లిదండ్రుల్ని పిల్లలు పట్టించుకోని వైనానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా చెబుతున్నారు.