Begin typing your search above and press return to search.

భార్యని హత్య చేసి ..రెండు రాత్రులు శవంతో ..!

By:  Tupaki Desk   |   10 July 2020 12:30 AM GMT
భార్యని హత్య చేసి ..రెండు రాత్రులు శవంతో ..!
X
సమాజంలో రోజురోజుకి దారుణ ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా కుటుంబ కలహాలతో భార్యని అతి కిరాతకంగా హత్య చేసి ,ఆ శవాన్ని రెండు రోజుల పాటు ఇంట్లోనే దాచిపెట్టిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. భోపాల్ కు 186 కిలోమీటర్లు దూరంలోని సాగర్ అనే గ్రామంలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. శవం రెండు రోజులుగా ఇంట్లోనే ఉండటంతో దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకి ఫిర్యాదు చేయటంతో వారు వచ్చి ఇంట్లో చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే .. షేర్ సింగ్ అహిర్వార్ అనే వ్యక్తి మద్యానికి పూర్తిగా బానిసగా మారిపోయాడు. ఈ విషయమై భార్య ఆర్తి అహిర్వార్ తో రోజూ గొడవలు జరుగుతూ ఉండేవి. వీరికి 10 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆర్తి తల్లితండ్రులు కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. జులై4 శనివారం రాత్రి తాగి వచ్చిన షేర్ సింగ్ భార్య ఆర్తితో గొడవపడ్డాడు. ఈ గొడవలో ఆవేశం పట్టలేక మద్యం మత్తులో భార్యని గొడ్డలితో నరికి చంపేశాడు. అయితే , కాసేపటికి మద్యం మత్తు దిగి భార్యను చంపిన విషయం గ్రహించాడు.

ఆ తరువాత ఆ విషయాన్ని బయటకి చెప్పకుండా ఆమె శవాన్ని ఒక చెక్క పెట్టెలో పెట్టి దాని మీద మంచం వేసుకుని పడుకున్నాడు. రెండు రోజులకి అతని ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగు పొరగు వారు పోలీసులకు సమచారం ఇచ్చారు. దీనితో పోలీసుల అతని ఇంటి వద్దకి వచ్చాడు. ఆ సమయంలో కూడా షేర్ సింగ్ మద్యం మత్తులో కనిపించాడు. అతని ఇంటిని సోదా చేసిన పోలీసులకు చెక్క పెట్టెలో పెట్టిన అతని భార్య ఆర్తి శవం లభ్యం అయ్యింది. దీనితో పోలీసులు శవాన్ని పోస్టు మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే మద్యం మత్తులో భార్యను హత్యచేసినట్లు నిందితుడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీనితో నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు.